పుట:2015.372978.Andhra-Kavithva.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసాత్మకం వాక్యం కావ్యమ్.

59



నైరీష్ కవులును, దిరిగి నీతియుగమును గావ్య ప్రపంచమున స్థాపింతు రేమో యనునూహ పొడముచున్నవి.

మస్లీమ్ వాయము. రూబయత్తులను కావ్యములస్వరూపము. - సుధీకవుల పద్దతి నీతికిని రసమునకు సమన్వయ మనఁదగును.

ఇంక మహమదీయవాగ్మ యముఁగూడ నించుక స్థాలీపులా కన్యాయమున నవలోకింతము, ముస్లిమ్ కవులలోను గోంతమంది ప్రాయికముగ నీతి బోధనం గావించిరి. సాధారణముగ. రూబయత్తులు---అనఁగాఁ 'గెంపులదండలు' అను కావ్య రూప ముల ముస్లిమ్ కవు లుపమానోపమేయముల సాధించి నీతి బోధనఁ గావింపఁజూచిరి. వీగలలో ఓమార్ ఖయమ్, జలా లుద్దీన్, సౌదీ, మొదలగువారు ప్రముఖులు. వీరును బ్రాయిక ముగ నీతిబోధనఁ గావించిరని నిర్ధారించుటకు వీలు లేదు. ముస్లిము 'లెప్పుడును రసప్రవృత్తి. గలవారే. వారిజీవితము ద్రాక్షారసము, హుక్కా, ఉద్యానవిహారము, పుష్పధార ణము మొదలగు మనోహర విషయములచే రసవంతముగ. నొనర్పఁబడుచుండును. అందుచేఁ బాయికముగ నీతి బోధనఁ. గావింపఁజూచిన పాఠకులు మన్నింప రనుభయమునం గవులు మనోహర విషయములను గూర్చి వ్రాయుచు మానవునికి సంతోసమొనఁగూర్చు విషయముల విసర్జింపక సర్వమును భగవ త్పరముగ నన్వయించుటకు నపకాశముఁ గల్గించుచుఁ గావ్య, మును రసవత్తరముగను నీతి ధ్వనించు నట్లుగను వ్రాసిరి. ఇట్టి కవులు సాధారణముగ సుఫ్వీమతమునకుఁ జేరినవార లై