పుట:2015.372978.Andhra-Kavithva.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట



గుప్పలుతెప్పలుగ సాంధ్ర సాహిత్యసీమను వెదఁజల్లి నారు. అని రేగుకంపలుంబోలె నాంధ్ర సాహిత్య సీమల నల్లుకొని ఆంధ్ర భాషావ్యవసాయమును జేసి కావ్య ఫలములఁ గామించనెంచు వారికి తీఱ రానీ కష్టములఁ గల్గించు చున్నవి.

ఆంధ్ర త్వమే యాంధ్ర సాహిత్యమునకు జీవమును గౌరవమును నొసంగును.

కావునఁ బ్రస్తుత మాంధ్ర, సాహితీ శ్రేయోభిలాషు లకు ముఖ్య కర్తవ్య మేమనఁ దరతరములనుండియు శత శతాబ్దములనుండియు నిరంతర ధారగఁ బ్రవహించుచున్న యాంధ్ర నాగరకతా స్రవంతిని నాంధ్ర సాహిత్యసీమను బ్రవ హింపఁ జేసి తత్ప్రవాహజలసాహాయ్యమున నాంధ్ర సాహిత్య సీమను జక్కగ వ్యవసాయముఁ గావించి యాంధ్రులకు బుష్టియఁ దుష్టియు, శాంతియు, దాంతియు, పన్నె యు, వాసీయుఁ దెచ్చు: "కావ్యఫలములఁ 'గాయించుటయే యగును. ఆంధ్ర సాహిత్యసీమను నాటుకొని 'పెరిగి పెద్దవిగాఁగల విజూ తీయకావ్య తరుల తాదుల నాటించి వానిచే సజాతీయ జాతీయ సారసమృద్ధములగు కావ్యఫలములఁ గాయం చుటయును మేలగును. ఇందులకు నన్యభాషాసంస్కారమును నన్య సాహిత్య పరిచయమును నవసరములే యగును. కాని యట్టిది యెల్లను నాంధ్రత్వమునకు 'వైరుధ్యమును, మూల ఛ్ఛేదమును, వినాశ మును, నాపాదింపక, మీఁదుమిక్కిలి యాంధ్ర త్వముసుబోషించి యాంధ్ర సాహిత్యమునకు నిఖిలసాహిత్య ప్రపంచమున నితర సాహిత్యములతో బాటు సమానస్థానముఁగూర్చి యాంధ్రులకు నలుగురితో సంబంధ బాంధవ్యములను రాకపోకలను గల్పింహా