పుట:2015.372978.Andhra-Kavithva.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

305



పత్తింగలసంబంధ బాంధవ్యములను గల్పించి యాంధ్రమునకు నలువురితో రాకపోకలు నేర్పఱచిరి. ఇందులకు భారతమును రామాయణమును, భాగవతమును మిగిలిన పురాణాదులును, జక్కని యాంధ్ర భాషను ననువదించిన తిక్కన భాస్కరయెఱఱ నపోతనాదులును, దమ ప్రబంధముల సచ్చటచ్చట నాంధ్ర, నాగరక ఆవాసనలఁ జొప్పించి యాంధ్రత్వమును బోషించిన జక్కననా రాయణామాత్య పెద్దనతిమ్మనరామకృష్ణాదులును మన వందనములకుం బాత్రులు. వీరు కొండొకయెడ నాంధ్ర దేశ మునకు సంబంధించిన కథలనుగాని యాంధ్ర భాషామర్యాదల సూచించు నానుడులగాని చక్కఁగాఁ గావ్యముల ననువదించి స్తుతిపాత్రు లయిరి.

3. సంస్కృత దాసులు. 

మూఁడవ తెగకుం జేరిన ప్ర బంధకవులు ఆంధ్ర సామ్రా, జ్య క్షీణదశయందుఁ గావ్యరచనకుఁ గడంగినవా రగుటచే స్వాతంత్య్ర బీజము లన్నియు నశించినకతనఁ బారతంత్య్రమునే శరణ్యముగఁగని బ్రదుకుచు సాహిత్యమునుగూడ సంస్కృత కావ్య నియమములను కవిసమయములను సంస్కృత భాషా, మర్యాదలను సనువదించి నే నాంధ్రుడ నని చెప్పుకొనుట గౌరవలోపమని భావించినకతన నేమోగాని యాంధ్రత్వమును నాంధ్ర జాతిలక్షణములను నాంధ్రులు . నాగరకతావై లక్షణ: మును గావ్యములఁ బొందుపఱుపక క్షీణదశనొందిన సంస్కృత వాజ్ఞ్మయమునందలి . యస్వతం త్రాధమళావ్యములనే లక్ష్యము లుగఁ గయికొని, జోంగియు జోడియు రాంచికొని బూది రాల్చి'నటుల . నీరస కావ్యములను మహా ప్రబంధము అను పేరిట ఆంధ్ర కవిత్వ-20