పుట:2015.372978.Andhra-Kavithva.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావప్రకటనము.

307



దగును. అట్టిసంబంధ బాంధవ్వములును రాకపోకలును ఆంధ్రులుసు ఆంధ్ర సాహిత్యమును దమ స్వాతంత్ర్యముఁ బోషించు కోను నంత కాలమును బ్రవర్దిల్లునేగాని, సొరతం త్యావస్థను వర్దిల్ల నేరవు. కావున నాంధ్రత్వమే యాంధ్రసాహిత్యమునకు జీవగఱ వంటిది. అట్టి జీవగఱ నూతఁగాఁ గొనక నడచు నాంధ్ర, సాహిత్యము కాలానుగతములుగ సంప్రాప్తించు నొడిదుడు కులకును నెగుడుదిగుడులకును తల మొగ్గుచుఁ గాలోగ్గుచు నడచుచు సహజమగు రాజఠీవిని, నొయారంపు నడలం గోల్పో యి వక్రగతిని కుంటి ముదుసలిరీతిఁ జరింపవలసివచ్చును. ఆంధ్ర త్వమే ప్రధానలక్షణముగాఁ గల యాంధ్ర సాహిత్య వధూటి నిజవై లక్షీణ్యముతో సహజసౌందర్యముతో సచ్చంపు దీవితో యథేచ్చముగ సంచరించుచు నిఖిలసాహితీకల్యాణమంటప మున నుచిత స్థానము నలంకరించును గావుత!!! ఓం తత్సత్.


- చెన్న పురి: 'వావిళ్ల 'ప్రెస్సున ముద్రితము, 1991.