పుట:2015.372978.Andhra-Kavithva.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

ఆంధ్ర కవిత్వచరిత్రము

________________

అక్షరమా త్రాచ్ఛందములకుఁ గల సంబంధమును, తారతమ్యమును. 

ఛందోరూపము లమితసంఖ్యాకములని యిదివరకే తెల్పియుంటిని. ఛందస్సునకు బీజము నాదమే. అట్టినాదము ద్వివిధావస్థలతో నొప్పుచున్నది. అక్షరములను శబ్దములను నాశ్రయించి కొనిన ఛంద స్సశురఛంద స్సగుచున్నది. అయ్యది గురులఘు భేదములపై నా ధారపడియున్నది. ఇఁక సంగీతమునకు సంబంధించిన ఛందస్సు మాత్రలయెుక్క సంఖ్యపై నాధార పడియున్నది. గురులఘువుల భేదము మన దేశమున విద్యార్థులకు, సైతము తెలియునుగాన దానిని గూర్చి చర్చించను. ఇంక మాత్ర యనఁగా నిమేష కాలమును తెప్పపాటు కాలమున నుచ్చరింప వీలగు నాదపరిమితీయే. కాన కవితయం దీ మా త్రాఛందస్సుపయోగింపఁబడు చున్నది. మా గ్రా ఛంశస్సునకును, ఆక్షర ఛందస్సునకును నొకరకమగు సమన్వయముఁ జేసి మా త్రా చ్చందస్సును కావ్యమున జొప్పించి యంగీకరింప వచ్చును. ఒక్కొక గురువునకు రెండు లఘువులు సరివచ్చును. లఘువొక్కమాత్ర సరియగును. కావున గురువునకు రెండుమాత్ర లగును. మనవారు గణమన మూడక్షరముల సముదాయ మనుచున్నారు. అట్టిగణములు మూఁడు లఘువు' లకుఁ దక్కువగాకుండను, మూఁడు గురువుల కెక్కువగా కుండను నుండును. అందుచే గణము మూఁడు మాత్రలకు తక్కువ గాకుండను, ఆఱుమాత్రల కెక్కువ గాకుండను నుండును. కావున మాత్రల సంఖ్యనుబట్టి ప్రాయికముగ మూఁడు తరగతుల గణము.లేర్పడును. అవి యెట్టివన------ రూపక.