పుట:2015.372978.Andhra-Kavithva.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

. రసము దేని నాశ్రయించికొనును

186


కణముల చల్లనీగా డ్పాసపడి వానిఁ
జెంది సుఖంబున్న సింహములయు
భూసుర ప్రవరులు భూతబలుల్ దెచ్చి
పెట్టునీవా రాన్న పిండతతులు
కడఁగి భక్షింప నొక్కటఁ గలసి యాడు
చున్న యెలుకలపిల్లుల యొండుసహజ
వై రిసత్వంబులయు సహవాస మపుడు
చూచి మునిశక్తి కెంతయుఁ జోద్యమంది.

.

(భారతము, ఆదిపర్వము. 8. ఆశ్వాసము.)

అనుపద్యమున వర్ణించియున్నాఁడు. అట్టిరసభావమే పూర్వ పుఋష్యాశ్రమములలో నుండెననియు, అట్టి యాశ్రమముల వలన లోకకల్యాణము నెఱువేఱుచుండెననియుఁ, బులులను మేఁకలను నేకజలాశయమున సుఖముగ నీరు ద్రావఁ జేయఁగల తపశ్శక్తియు రసభావమును నేఁటినాగరికతయందు మృగ్యమగు చుండిన కతముస నే ప్రస్తుతము జీవిత సంరంభముఘోరముగను, దుర్బరముగను నున్నదని రవీంద్ర నాథరాకూరు కవితన “Messages of the forest" (అరణ్యసం దేశ) మనువ్యా సమునందు వ్రాసెను. అట్టి సనాతన రసభావము తిరిగి మన దేశమున శాంతిని నెల గొల్పెడుఁగాక!

--*****--