పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
146

కాళిదాస చరిత్ర

అందఱు మఱునాడు రజ్జునొద్ద సెలవుగైకొననిశ్చయించిరి. మఱునాడు భోజమహరాజు మంత్రిసామంత కవిగాయక సపరివారసమన్వితుడై పేరోలగం లున్న సమయంబున శంకరకవిలేచి “తాను, కాళిదాసుడు సన్యసించి కాశి, సాకేతము, బృందావనం, మొదలగు క్షేత్రములందు నివసించదలచుకొంటిమనియు, సెలవునొసంగవలయుననియు వేడుకొనెను. అట్లుచేయవలదని రాజు వారిని బహువిధముల బ్రతిమాలుకొనెను. వారు పట్టినపట్టువిడువకపోవుటచే నెట్టకేలకు మహరాజంగీకరించి మీమీకోరికలు జెప్పమనియెను. అందు ముందుగా దండి తనకోరిక నిట్లు విన్నవించెను.

శ్లో॥కదా చారణస్యా మదురతటినిరోధన ననన్
   నహసం కౌపీనంతిరసినిదఢానోంబలిపుటం
   అయే గౌరీనాధ! త్రిపురహర! శంభో! త్రినయన
   ప్రసీదేతి క్రోశ న్నివిషమించిన నేష్యామి దినసార్.

తా॥వారణాసిలో నాకాశగంగాతీరమున నిలిచి గోచీపెట్టుకొని శిరముపై నంజలిఘటించి ‘ఓశంభూ! ఓ గౌరీనాధ! ఓ త్రిపురహర! ఓత్రినయన! అనుగ్రహింపుము ‘ అని మొఱపెట్టుచు దినములను నిముషములవలె నేనెన్నడు గడుపుదునోగదా!

అడవిభోజనము “సరే! నీవుకాగితంబొమ్మ” అని యానతిచ్చెను. అనంతరముభవభూతి తనమనోరధ మిట్లువిన్నవించెను.

శ్లో॥కదావా నాకేతే విమలసరయు తీరపులివ

  ననాన: కౌపీనం శిరసి నిధదానోంజలిపుటం 
  ఆహో! రామస్వామిన్ జనకతనయయావల్లభవిభో! 
  ప్రసీదేవి క్రొశన్ నిముషమిన నేష్యామి దినసాన్


తా॥అయోధ్యాపురమున నిర్మలమైబ సరయూనదీపులినతల మందు కౌపీనము ధరించి శిరసిమీద నంజలిపుటముగూరి ‘ఓ రామ