పుట:హాస్యవల్లరి.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుఱు క్షేత్ర సంగ్రామం

తాళ్ళమెరక భూములు సుక్షేత్రాలు, అవి బంగారం పండేవి. వాటిల్లో పెంటా ఎరువూ ఏనాడూ పడకపోయినా, అవి ముక్కారునా విరగపండడమే గాని రెండోమాట ఎరగవు. ఆవూరికి తూర్పున రెండుమైళ్ళ దూరాన్ని ఉత్తరదక్షిణాలుగా ఓ పంటకాలువ ఉంది. దాని పడమట గట్టుని జేరి రెండు ఖండాలు, ఒక్కొక్కటి యాభైయేసి యకరాలది, కాలవనించి కొంతమేర వదిలిపెట్టగా, ఓదాని కోటి కాడిగట్టుగా ఉండేవి. అందులో దక్షిణపు వేపుది మిరియాల వారిది; ఉత్తరపుదిక్కుది శొంఠివారిది. భూఖామందులు గ్రామాంతర ఉద్యోగాలు ఆర్జించి వెళ్ళిపోయి అవి రైతులకి అమర్చారు. పన్నులు పెట్టుగుని అమరకం ఎకరపుపుట్లు ఖామందుల ఇంటిదగ్గర అప్పచెప్పేవారు. మిరియాలవారి భూమి వనమయ్యా, శొంఠివారిది. అతని జ్ఞాతి పనసయ్యా, పుచ్చుగున్నారు. గొడ్లకోసం అని మొదట సాలలు కట్టి, ఎప్పుడేనా రాత్రి బసకోసం అని పాకలు వేసి, చివరికి వాళ్ళిద్దరూ ఆవరణా ప్రహరీగోడలతో సహా రెండు భవనాలు ఖామందుల్నడిగి కాలవ సరాసరిని పొలాల్లోనే కట్టుగున్నారు. ఆ ఇళ్ళకి మధ్య నలభై యాభైగజాల నిడివిగల భూమిఉంది, ఎవరిదో కొన్నాళ్ళవరకూ తెలియకుండా బంజరు ఉండి, దుబ్బు వేసింది. అదుబ్బూ ఏ చుట్టనిప్పురవ్వో పడి కాల్తోచ్చేది. తరవాత చాలా కాలంకూడా అది నాది అన్న మొగాడులేడు, ఫలానావారిది అని తేల్చిన ఉద్యోగిలేడు, నేను బాగుచేస్తాను అన్ననాథుడు లేడు. అంతమంచి భూముల మధ్య ఆక్షేత్రం ఎల్లా తయారైందో ఎవరికీ తెలియదు, ఆభూమి అంతాపోగుచేసి ఎకరంలోపు! వనమయ్య పనసయ్యలు తమ రింత పిసుక్కుతిని, ఇంకోరికింత పడెయ్యగల స్థితిలోనే ఉంటోచ్చారు. వనమయ్యకి ముసిలితల్లీ పడుచుపెళ్ళాం మధ్య త్రాసు నిదానంగా పట్టుగునేసరికి నవనాళ్లూ కుంగిపోయేవి. పనసయ్యకి వెధవఅక్కా, సుస్తీపెళ్ళాం జరిపే పోరుహోరుజోరు జలుబు వొదలగొట్టేస్తూండేది. ఇళ్ళ మధ్య ఖాళీస్థలం ఎవరిదైతేం గనక చెరిసహంగా వాడుకోడంలో ఏవిధమైన పేచీలూ రాకుండా, మాధ్యస్తంలో ఏకరేఖగా అయిదారు రాళ్లు వీళ్ళే పాతుగున్నారు, దాంతో దక్షిణపు వేపు ఇంటికి ఉత్తరాన ఇరవై గజాల పొడుగునా, పనసయ్యఇంటికి దక్షిణాన ఇరవై గజాల చొప్పునా ఖాళీస్థలం వారివారి వాడకాలకి కేటాయింపు అయిఉంది. అది వాళ్ళు పుల్లాపుట్రా వేసుగునీ, పురీగట్రాకట్టుగునీ యథాశక్తిగా భుక్తపరుచుకుంటున్నారు. అదికూడా ఊడుపుభూమిగా మారిస్తే బాగా ఉంటుందనే ఊహలు వాళ్ళకి వంట్లోనూ ఉన్నాయి. ఇంట్లోనూ ఉన్నాయి, ఉన్నా, వాళ్ళు హానీ, హింసా తెలియనివాళ్ళు గనక, ఆ ఊహలు చాలాకాలం పొక్కలేదు.

వనమయ్య పనసయ్యలు జ్ఞాతులే అవడంచేత శుభాశుభాల్లో తప్పవిడిచి, సహాసన సహభోజనాలు లేకుండానే వ్యవహరించేవాళ్లు. కాని అవసరం వల్ల ఒకనాడు సాయంత్రం కాలువగట్టుమీద గృహమధ్యరేఖకి సూటిగా వాళ్లరూ కొంత ఎడంగానే కూర్చుని ఉండగా ఈ సంభాషణ జరిగింది.

పనసయ్య - ఈమధ్య ఉన్న చెక్క అసలు మినహా అని మనం అనుకుంటున్నాం!

వనమయ్య - నేను అనుకోటంలేదు.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

162

హాస్యవల్లరి