ఉత్తరభాగము. ఆ. 3.
295
నేనయు దాడివెట్టెద విశృంఖలతం బ్రతిపక్షువెంట మీ
రీనెఱికిన్ సహాయపడు టీప్సిరమేనిఁ గడంగుఁ డుక్కునన్.94
ఉ. ద్వారక సొచ్చె నేనియును వారక యుగ్రతఁ గిట్టి పట్టి య
వ్వారిధిదుర్గ మంతయును వ్రచ్చి విరోధి సబాంధవంబుగాఁ
బోర వధించి రుక్మిణిఁ బ్రభూతనిభూతి యెలర్పఁ దెంతు నా
పేరును బెంపు నూకక యవేతత నొందుట కోర్వవచ్చునే.95
వ. అని సంరంభంబున సముత్థితుం డగుటయుఁ బౌండ్రకవాసుదేవుం డతని కడ్డంబు
వచ్చి.96
తే. ఏను నీబంట నుండంగ నింత యేల, నీకు ధరణీశ ననుఁ బంపు నిలువు మీవు
శౌరిఁ దునుమాడి తత్తనుశకలకోటి, పంచిపెట్టుదుఁ గాంతారపత్రితతికి.97
చ. ఇరువురు వాసుదేవులు మహిం గలరే యది మాన్పఁ గోరు నా
కిరవగుకాల మిప్పగిది నింపెసలారఁగ నేఁగుఁదెంచె ను
ద్ధుర యగు మద్భుజావిభవధుర్యత లోకము మెచ్చఁ జేసెద
న్నరవర నీమనఃప్రియ మొనర్పంగఁ గాంచుట యల్పకృత్యమే.98
క. అనునెడ శిశుపాలుం డొక, ఘనపరిఘము కేలఁ దాల్చి గ్రక్కున జననా
థుని యెదుర నిల్చి గర్వం, బెనయ నఖిలనృపులు వినఁగ నిట్లనియెఁ దగన్.99
తే. పెండ్లియాడుదు నని కడుఁ బేర్మితోడ, నిట్లు గైసేసి తుది నింత యెడరునొంది
యున్న నాక కా కీయొచ్చ మొరుల కేమి, గారణము నిల్వుఁ డెవ్వారుఁ గదలవలదు.100
క. ఈపరిఘ మొక్కటన ద, ర్పోపేతునిఁ గృష్ణుఁ బెఱయదూత్కరము ననిన్
రూపెడలఁ జేసి నేఁడీ, భూపతి[1]బంట నగు టుర్విఁ బొగ డొందింతున్.101
క. క్షత్రియుఁ డగువాఁ డన్యక, ళత్రంబున కాసపడునె లఘుచరితుఁ డిలన్
క్షత్రియుఁడు గామి నయ్యదు, గోత్రం డిటు సేసెఁ గాక కుత్సితవిధమున్.102
తే. అదియునుం గాక జనియించు టాదిగాఁగఁ, బసులలోనన పెరిగిన పాలనుండు
వావి మాలినపశుమార్గవర్తనంబు, నూను టరిదియె యిది యేల యుగ్గడింప.103
వ. ఎల్లవిధంబులఁ గృష్ణు వధియించి భోజకన్యకం గ్రమ్మరించుట నాకుఁ గర్తవ్యం
బనియె నంత జరాసంధప్రముఖు లగుమహారథులందఱు నారూఢ
రథులు నుదాత్తకోదండులు నాబద్ధకవచులు నై యాయోధనంబునకు వెడలిన
నఖిలసైన్యంబులు సన్నద్ధంబు లై భేరీమృదంగశంఖకాహళాదివాదిత్రనాదంబులు
రోదసీభేదనంబు లై చెలంగం గదలె ని ట్లరిగి వారలు రుక్మిణీహరణపారగుం డై
దూరంబున ముందటం జను ముకుందునకుఁ బిఱుం దై నడచు యాదవసైన్యం
బులు గదిసిన.104
- ↑ బంటగుదు నుర్వి