పుట:హరివంశము.pdf/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 1.

239

వ. ఇక్కడ నఖిలయాదవులు నుగ్రసేనవాసుదేవసహితంబుగ జరాసంధభయార్తు
     లయి కార్యచింతనంబునకుఁ దొడంగునెడ నయ[1]కళానిర్నిద్రుం డగువికద్రుం
     డనుయదువృద్ధుండు వారల నందఱ వినుం డని కృష్ణున కి ట్లనియె.18
మ. యదువంశంబున నంబుజోదరమునం దా బ్రహ్మయుంబోలె నీ
     వుదయంబొంది సమ స్తయాదవభయవ్యుచ్ఛేదదక్షుండ వై
     త్రిదశేంద్రాదులమంతనంబులును బుద్ధిం గాంతు నీదృష్టి య
     భ్యుదయాపాదిని మాకు నీవసమ యీయుత్సాహసన్నాహముల్.19
క. అపరిమితనృపసహాయుఁడు, కపటోపాయుఁడు గఠోరకర్మనిపుణుఁ డా
     రిపుఁ డతని నీవ యనిమొన, నపజితుఁ గావించుటకు సమర్థుఁడ వనఘా.20
వ. కంసుండు బలగర్వితుం డై తనకు నెదురు లే దని యెవ్వరిం గైకొనక కోట పాటిం
     పమిం జేసి వప్రద్వారసంక్రమపరిఘాయంత్రాట్టాలకంబు లయ్యైప్రయత్నంబు లెడలి
     యసంస్కారంబు లై యాయుధంబులును ధనధాన్యాదులును సంగ్రహింపంబడక
     యిప్పురంబు దుర్గం బని నమ్మరాక యున్నది. అదిరిపాటున వచ్చి పగతుండునుం
     గదియవిడిసె నడరిపొదివె నని దిగులుసొచ్చి లోపలివా రెవ్వరుం దలసూపకున్న
     నిది గోలుపోయిన యదియ రాష్ట్రంబునుం ద్రొక్కుడువడి చెడిపోవు నింక
     నొక్కటి సెప్పెద.21
క. విను దక్షిణాపథంబున, వనజేక్షణ తనరు ఋక్షవంతము వింధ్యం
     బును సహ్యము ననఁగాఁ గల, యనుపమశైలములు బహుగహనసంకటముల్.22
వ. తొల్లి ముచికుందుండు పద్మవంతుండు సారసుండు హరితుం డను పేళ్లంగల యదు
     వంశభూపతులు నలువురు వైరిభయనివారణార్థంబుగా నమ్మహాగిరులయందుఁ
     గావించినదుర్గంబు లనేకంబులు గలవు పడమటిసముద్రంబులోని దీవులును బహు
     విధంబు లానలువురురాజులకుం బెద్దవాఁ డైనమాధవుం డీమధురాపురంబు
     పాలించినవాఁడు దీని నలవరించుట యివ్వేళకు లాగుపడ దిప్పటికి నవ్యదుర్గ
     సమాశ్రయంబు వలసినయది యేను గార్యంబుజాడ గొంత యెఱింగించితి దీనికిం
     దగిన తెఱంగు నీవును విచారించి యెయ్యది వెర వవ్విధంబు నిర్వహింపు మనిన
     వికద్రు వాక్యంబు లాకర్ణించి కృష్ణుం డి ట్లనియె.23
క. ఇది యట్టిద నీ చెప్పిన, సదభిమతోదారఫణితి సర్వము వింటిన్
     మదిలోనఁ గంటి దీనికి, నొదవంగ నుపాయ మొకటి యూహించి తగన్.24
ఉ. ఏనును నన్నయుం దడయ కిప్పురి వెల్వడి పోయి యాజరా
     సూనుఁడు దత్సహాయులును జూడఁగ దక్షిణదిక్కు వోవఁగాఁ

  1. కాల; నిత్య