పూర్వభాగము - ఆ. 9.
233
లగుగోత్రనామంబు లెఱింగించి గురుత్వంబునకుం బ్రార్థించిన సంప్రాప్తసమ్మతుం
డై యతండు వారిం బ్రియశిష్యులంగాఁ బరిగ్రహించి సంస్కారపూర్వకం
బగుసకలకళాకలాపంబు నొసంగిన.<192
శ్రీకృష్ణబలరాములు సాందీపునియొద్ద సకలవిద్యాభ్యాసంబు సేయుట
సీ. అతిలోకధీగుణోదాత్తులై యన్నయుఁ దమ్ముండు నోలి వేదములు నాల్గు
నంగంబు లాఱును నఱువదినాలుగుదినములఁ జదివిరి దననుధర్మ
శాస్త్ర తర్కన్యాయసరణియు గణితగాంధర్వలేఖ్యములు గంధర్వదంతి
రథశిక్షలును వాసరములు పండ్రెంటను నెఱిఁగిరి సాంగమై వఱలునస్త్ర
తే. నిగమ మేఁబదినాళుల నెఱయఁ గఱచి, రిట్టినిత్యప్రకాశసమిద్ధమహిమ
సూచి నరరూపధరు లైనసూర్యచంద్రు, లని తలంచె వారల గురుఁ డాత్మలోన.193
వ. మఱియుఁ దదీయప్రభావం బెఱుంగం గోరి తచ్చరితం బరయునెడఁ బర్వకాలం
బునఁ బార్వతీపతి నతిరహస్యాభ్యర్చనంబుల భజియింప నమ్మహాదేవుం డమ్మహాను
భావులచేయు సపర్యలు సాక్షాద్భావంబునం గైకొనం గనుంగొని యతండు వీరు
సామాన్యపురుషులు గా రెయ్యదియే నొక్కదివ్యాంశంబున జనియించినవారు
వీరిచేత నెంతలెంతలు పను లైనను నగు నని నిశ్చయించె నంత నభ్యస్తసకల
విద్యుం డై కృష్ణుం డగ్రజసహితంబుగా నాచార్యునకు నమస్కరించి.194
క. ధన్యుల మైతిమి మీకృప, మాన్యగుణోదార నీవు మము నొకయర్థం
బన్యూనంబుగ నడుగు మ, నన్యసులభ మైన దద్ది యైనను వేడ్కన్.195
చ. అనిన గురుండు నా కనఘ యాత్మజుఁ డొక్కఁడు వానిఁ దీర్థసే
వనసమయంబునఁ లవణవారిధిలోఁ దిమియొక్కఁ డుగ్రమై
కొనిచనియెన్ దదాది యగుఘోరపుశోకము వహ్నియై మదిం
గనలుచు నుండు నక్కొడుకు గ్రమ్మఱిఁ గల్లెడునట్లు సేయవే.196
వ. అ ట్లయిన మాకులం బెల్ల నుద్ధరించినవాడ వై గురుదక్షిణాప్రదులలోన నగ్రగ
ణన గనియెద వనిన నల్లకాక యని కృష్ణుండు రాముచేత ననుజ్ఞాతుం డై శితాసి
శరసమేతం బగుబాణాసనంబు [1]గైకొని సముద్రుకడకుం బోయి.197
తే. మహితయగుఁడు సాందీపని మాగురుండు, సుతునిఁ గోల్పోయె నీయందు సూపు మాకుఁ
దద్విఘాతకుఁ డగు ద్రోహిఁ దడయ కనిన, జలధి సాకారుఁ డై కరంబులు మొగిడ్చి.198
క. పంచజనుం డనుదైత్యుఁ డు, దంచితతిమిరూపధారి యై గురుపుత్రున్
వంచన హరించి మ్రింగెను, గ్రంచఱ నొప్పింతు వాని ఘనభుజ నీకున్.199
- ↑ ధరియించి