పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

శ్రీ సీతారామాంజనేయసంవాదము


రించి సుషుమ్నయందునిల్పి యెడమముక్కునవిడుచుచు నీతీరున నెల్లప్పుడు యథా
శక్తిగ ప్రాణాయామము చేయుచుండవలయును. ఈ ప్రాణాయామముప్రాకృతమని
కుంభకమని త్రివిధము. అందు నేఁటిదినము సూర్యోదయము మొదలు రేపటి
సూర్యోదయమువఱకు మూలాధారకమలంబున గణపతికి ఆఱునూఱును, స్వాధిష్ఠానకమలమున
బ్రహ్మకు ఆఱువేలును, మణిపూరకకమలంబున విష్ణుదేవునకు అఱువేలును,
అనాహతకమలంబున రుద్రునకు ఆఱువేలును, విశుద్ధకమలంబున నీశ్వరునకు సహస్రంబును,
ఆగ్నేయకమలంబున సదాశివునకు సహస్రంబును, సహస్రారంబున గురువునకు సహస్రంబును,
అజపాగాయత్రీమంత్రజపమును సమర్పించుటే ప్రాకృతప్రాణాయామము.
రేచక పూరక కుంభక క్రమములచేత తొలుత అధస్సంచారముగలప్రాణవాయువు
నందు ఊర్ధ్వసంచారముగల యపానమును, వెనుక ఆపానమందు ప్రాణమును చేర్చుట
వైకృతప్రాణాయామము. మూలబంధ ఉడ్యాణబంధజాలంధరబంధములగావించి
రేచకపూరకములను నిలిపి ప్రాణాపానములను రెంటిని రేపగ లొక్కఫక్కిగ నిలుపుట
కుంభకప్రాణాయామము. రేచకమనఁగా ప్రాణవాయువును మూలాధారమునుండి
బ్రహరంధ్రపర్యంతము సుషుమ్నానాళద్వారముగ నుత్థాపనము చేయుట;
పూరకమనఁగా: బ్రహ్మరంధ్రపర్యంతము రేచించిన వాయువును మరల సుషుమ్నా
నాళద్వారముగ మూలాధారమునఁ జేర్చుట, కుంభకమనఁగా రేచించిన వాయువును బ్రహ్మరం
ధమందు మాత్రాసంఖ్యన నిలుపుట. ఇదే యూర్ధ్వకుంభకము. పూరించిన వాయువును
మాత్రాసంఖ్యగ మూలాధారము నిలుపుట అధోకుంభకము.

బంధత్రయవివరణము.


తే. గుహ్యమున వామపాదంబుఁ గూర్చి యితర
    'పాదమూలంబు నాభినిఁ బరఁగఁ జుబుక
    మురమునను జేర్ప నివి బంధవరము లండ్రు
    ఆర్యనుత వీనిఁ దెలియు మీ వాత్మయందు.

క. మడమను యోనిస్థానము, విడువక బంధించి యూర్ధ్వ వీథికపానున్
    పడి నాకుంచనమునఁ గొని, పడ నాకర్షింప మూలబంధం బయ్యెన్.

తే. కృత్రిమము లేక నాభికి గ్రిందు మీఁదు
    బలిమి మై బంధనము సేయ వలయు దీనిఁ
    బరమయోగీంద్రు లుడ్యాణబంధ మండ్రు
    బంధములలోననుత్తమం బండ్రుదీని.