పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

391


యవధూతుఁ డిచ్చిన యాసిద్ధలింగంబు
        నాహార మడిగిన యతని కిచ్చి
కంబ మెక్కిననాఁడు కమలాప్తుఁ డిచ్చిన
        కుండలంబులు యాచకునకు నిచ్చి
యసురేంద్రుఁ డిచ్చిన రసరసాయనములు
        కలహించు నిద్ద రర్థులకు నిచ్చి


ఆ.

నయముతోఁ ద్రిగాలనాథుఁ డిచ్చినబొంత
యాదిగాఁగ రాచపేద కిచ్చి
వీరవిక్రమార్క ధారుణిఁ జరియించు
పారిజాత మనఁగఁ బరఁగి తీవు.

129


క.

ఖేచరపతిశిబికర్ణద
ధీచుల నినుఁ బోల్పరాదు దీనుల కర్థం
బేచోట నిచ్చి రుర్విని
నీచాగము సర్వవస్తునివహము గాదే.

130


క.

అర్థం బన్యుల నడిగిన
యర్థులు వ్యర్థులును గడు నిరర్థులు నట యో
పార్థివ నినుఁ బ్రార్థించిన
యర్థులు సార్థులుఁ గృతార్థు లధికసమర్థుల్.

131


మ.

అనుచుం బెక్కువిధంబులం బొగడఁగా నాబాలవిప్రద్వయం
బును వారించుచు నింత యేల హృదయాంభోజంబులో నున్న ప్రా
ర్థన మీకే మది వేఁడుఁ డిత్తు ననినఁ ధాత్రీశ్వరా నీవు ద
ప్పనిరాజేంద్రుఁడ వేని యాయమృతకుంభం బిమ్ము మా కింపగున్.

132