పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

సింహాసన ద్వాత్రింశిక


పోరునప్పు డురగములు శేషుపంపున
వచ్చి విక్రమార్కువారి నడఁచె.

123


మ.

తన సైన్యంబులు ఘోరసర్పవిషనిర్దగ్ధంబు లైన న్మనం
బునఁ జింతించి యతండు వాసుకి మహాభోగేంద్రు సేవించి యా
తనిచేత న్సుధఁ దెచ్చి సేనలకుఁ జైతన్యంబు రప్పింతు నే
నని యేగె న్నిజభృత్యరక్షణగుణాయత్తుండు మంథాద్రికిన్.

124


క.

ఆ మందరగిరితటమున
భూమీశుఁడు భక్తినిష్ఠ భుజగేంద్రకుల
స్వామికిఁ దపమొనరింపఁగ
నామహనీయుఁడు ప్రసన్నుఁడై వేఁడు మనన్.

125


క.

నీరూపం బమృతోద్భవ
కారణ మటు గాన నీవె కర్తవు నాసే
నారక్షణమునకు సుధా
పూరిత మగుకలశ మిచ్చి పుచ్చు మహీంద్రా.

126


చ.

అని ప్రణమిల్లిన న్ఫణికులాధిపుఁ డయ్యమృతంబు కుండలో
నినిచి ప్రియంబుతో నొసఁగి నీ విఁక నేగుము నావుడు న్రయం
బునఁ దమతల్లి దాస్యము విముక్తము సేయ సుధారసంబు నే
ర్పునఁ గొనివచ్చు పక్షిపతిపోలికతో నృపుఁ డేగుదేరఁగాన్.

127


ఉ.

దీప్రముఖప్రసన్నుతు లతిప్రమదప్రకృతిప్రశస్తలో
కప్రియవాదు లప్రకటకార్యులు సుప్రభలందు సూర్యచం
ద్రప్రతిమాను లప్రతిహతప్రతిభాగతి నప్రమేయులౌ
విప్రకుమారు లంతఁ బృథివీపతిఁ జేరి నుతిప్రవీణులై.

128


సీ.

శివుఁ డిచ్చ మెచ్చి యిచ్చిన దివ్యఫలముఁ గా
        రుణ్యంబుతోఁ గుష్టరోగి కిచ్చి