పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

సింహాసన ద్వాత్రింశిక


వ.

నీ విప్పుడు పెద్దతలవరికి రాజు బండారంబు చూఱవిడిచె నేఁడు మొదలుగా నేడుదినంబులుదాఁక జను లెల్ల నిచ్చకు వచ్చువానిం గొనిపొండని చాటించి దేశంబువారి నెల్లఁ జూఱకు రండని యీప్రొద్దె బంట్ల నూరూరికి బంచుమని చెప్పు మనవుడు భాండాగారికుం డతివిస్మితుండయి ధనకనకాదివస్తువులం గోశగృహంబులు నించి విఘటితకవాటంబులుగఁ జేసి తలవరికిం దత్క్రమం బెఱింగించిన.

83


క.

జనపతి యేడుదినంబులు
తనబండారంబు వస్తుతతి చూఱలుగా
నొనరించు వలయునది కొని
చనరో యని యతఁడు వీటఁ జాటఁగఁబంచన్.

84


క.

ఊరూరికిఁ జెప్పఁగఁ దన
వారిని బనుచుటయు నెల్లవారును గుంత
న్వారింపఁబడక చేరెడు
వారిక్రియ న్వచ్చి రయ్యవంతీపురికిన్.

85


ఆ.

వచ్చి వీరువారుఁ జొచ్చి విచ్చలవిడి
బుడమతోఁట వీటిఁబుచ్చునట్లు
నేడుదినము లం దనేకవస్తువులను
గొనుచు నేగి రింపు గొనబుసాఁగ.

86


క.

తనిసి ప్రజ చనిన నష్టమ
దినమున బండారి వసుమతీరమణునకున్
వినిపించెఁ బూని చూచిన
ధనసంఖ్య త్రయోదశార్బుదము లయ్యె జుమీ.

87


ఉ.

ఈగతిఁ జన్న యీగి ధరణీశ్వర నీకడలేదు గావునన్
వేగమె క్రమ్మఱం జనుము వీఱిఁడిచేఁతలు మాను మన్న సా