పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxvi


    అట్టి సతిని ̃ఱెప్ప వెట్టక చూచుచు
    నిద్ర యాఁకలియును నీరువట్టు
    నడఁచి యధరరేఖ నమృతంబు గ్రోలుచు
    దేవుఁ డనఁగ మనుజదేవుఁ డొప్పె.

క. వనితలకు నురము నోరును
   దను వర్ధము నిచ్చి రచ్యుత బ్రహ్మ శివుల్
   ఘనుఁడా మువ్వుర మీఱుచు
   జనపతి దన సతికి నిచ్చె సర్వాంగములున్.

సీ. అవనీశు డీక్రియ నంతఃపురంబున
           విహరించుచును మంత్రివిన్నపమున
           * * *

ఈ విధముగ పచ్చిశృంగారమునగాక సాధారణధోరణిలో 5 పద్యములలో సరిపెట్టినాడు. ఈ కథయందే నందరాజు కొడుకు జయపాలుడు భల్లూకముచే శపింప బడి 'ససేమిరా' అని ఆరచుచుండును. ఎవరైన జరిగిన విషయమును వెల్లడించిన వెంటనే ముక్తి పొందును. మూలమున 'ససేమిరా'కు నాలుగు శ్లోకములు చెప్పబడినవి.

“స” అను అక్షరమునకు

“సద్భావంప్రతిపన్నానాం వంచనే కా విదగ్ధతా
 అంకమారుహ్య సుప్తానాం హననే కిం ను పౌరుషమ్.

 దీనికి జక్కన

 “సకల లోకోపకార సంచారులైన
 సాధు జనుల వంచించుట జాణతనమె?
 తొడలపై నమ్మి నిద్రపోయెడు వయస్యుఁ
 బగతు పాలనుఁద్రోయఁ బాపంబు గాదె.