పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxv


చ. అని తన యిచ్చలో వగచి యన్నరపాలునితో వినీతి గో
    పనమతి మంత్రి యిట్లనియె ... .... ...... ......

ఉ. నావుడు మంత్రివర్యునకు నందమహీపతి ప్రీతినిట్లనున్
 
           * * *

క. ఒక్క రే యొక్కమహాయుగ ... .... ....... ......

సీ. కైసేసి చెలువ నాకడ నల్ల నిలిచిన
         నంగజశ్రీ జూఱలాడఁ జూతు

ఉ. కన్నులు గండుమీలు ... ... .....

క. ఏనొక నిముషంబైనను
   భానుమతీ దేవిఁబాసి ప్రాణముఁ బట్టం
   గా నోప నీ విచారము
   మానుమనిన మంత్రి యనియె మనుజేశ్వరుతోన్.

ఇందు నంద భూపాలుని లాలసత్వము పరాకాష్ఠ నందుకొన్నది. రాబోవు ప్రబంధ యుగమునకు ఒరవడిగా జక్కన రచన సాగినది. గోపరాజు ఈ ఘట్టమును

క. ఆ నందభూపతికి సతి
   యానందము రూపమయ్యె ననఁ గలిగెఁ ద్రిలో
   కీనయనచకోరములకు
   భానుమతీదేవి యమృతభానుద్యుతియై.

సీ. దీపిత కనక సందేహంబు దేహంబు
         పచ్చకర్పూరంబు పలుకు పలుకు
   పల్లవ సంపదాస్పదములు పదములు
         శోభితావర్తసనాభి నాభి
           * * * *