పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

255


చెలగుఁచు మలయాచలమున
సెలయేఱుల భంగి జలధిఁ జేరఁగఁ బాఱెన్.

266


ఆ.

అంత నమరసిద్ధయక్షగంధర్వులు
గొలువ గగనతటిని జలకమార్చి
సిరులు మిగుల గౌరి జీమూతవాహను
ఖచరచక్రవర్తిగా నొనర్చె.

267


వ.

అట్టియెడ నత్యంతసంతుష్టాంతరంగుం డై గరుత్మంతుండు చనుదెంచి నీ కెద్ది యిష్టంబు వేడు మనిన నక్కుమారుం డురగహరణం బుడిగి దృఢప్రతిజ్ఞుండవుగ మ్మింతియ చాలు నీప్రసాదంబున నాకేమియుం గొఱంత లేదు.

268


క.

అనదలఁ గాచితి నాగురు
జనముల ప్రాణములు నిలిచె సర్వేశ్వరిమ
న్నన గలిగె నీవు మెచ్చితి
విను రాజ్యం బబ్బె నేమి వేఁడెద నింకన్.

269


చ.

అని వినయోక్తిఁ బల్కి జగదంబికఁ గ్రమ్మఱఁ బ్రస్తుతించి య
జ్జననికి మ్రొక్కి యిష్టజనసంగతుఁ డై చని తొల్లి యున్న కాం
చనపురిఁ జొచ్చి రాజ్యసుఖసంపదఁ దేలుచు నేలుచుండె న
వ్వనితయు దాను నాత్మగురువందననందితచిత్తవృత్తియై.

270


వ.

కావున నట్టిపరోపకారశూరుం డెవ్వఁడు గలఁడు.

271


ఆ.

వింటి మతనిఁ దొల్లి కంటి మీతని నేఁడు
విందు మిప్పు డొక్కవిక్రమార్కు
ననిన నతనివనిత దనుజేంద్ర విక్రమా
దిత్యుఁ డీతఁ డొక్కొ తెలియు మనియె.

272