పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

సింహాసన ద్వాత్రింశిక


క.

చల్లిన సంజీవితుఁ డై
యల్లన సుఖనిద్ర దెలియుననువున నతఁ డు
త్ఫుల్లముఖుం డై గజముఖు
తల్లికిఁ బ్రణమిల్లెఁ దల్లిదండ్రులుఁ దానున్.

260


క.

మగలకు మగఁ డగుమరునిం
దెగఁ జూచిన శివునిదిక్కు దృక్కుల నిడి యా
మగతనము సగము చేసిన
మగువా మాపాలఁ గలిగి మన్నించితివే.

261


వ.

అని యందఱు నానందంబున వందనం బొనర్ప మలయవతి కృతాంజలి యై.

262


క.

గరళము మ్రింగినపతికి
న్మరణముఁ దప్పించి మెఱియు మంగళసూత్రా
భరణము గలదేవత వని
పరిచర్య యొనర్చినట్టిఫల మిటఁ గంటిన్.

263


క.

అని మ్రొక్కఁగ దివిఁ దూర్య
ధ్వను లొలయఁగ సకలదేవతలుఁ గొనియాడ
న్వినతానందనుకతమున
ననిమిషకుసుమములతోడ నమృతము గురిసెన్.

264


క.

ఆయమృతంబున నస్థిని
కాయము సప్రాణ మైనకాయంబుల న
త్యాయతఫణమణిరుచి సము
దాయము మెఱుఁ గిడఁగ నెగసె దర్వీకరముల్.

265


క.

చెలులుం జుట్టలుఁ గలయం
జెల రేఁగి సుధాంబుపూర్తి చెలువునఁ జాముల్