పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

సింహాసన ద్వాత్రింశిక


వినతసుతుండు నీ వనునివేకము లేక యహీంద్రుఁ డంచు నీ
సునఁ దెగటార్చె నొక్కొ యనుచుం దను వంటఁగఁ జేర్చి యేడ్వఁగన్.

229


ఆ.

వధ్యచిహ్న మైనవసనంబుఁ జూచితి
నెఱుఁగనైతి నీతఁ డెవ్వఁ డనిన
వ్యోమచరవిభుండు జీమూతవాహనుం
డనుడు వెఱఁగు పడుచునడలి గరుడి.

230


క.

మందరతటమున హిమవ
త్కందరముల మలయసీమఁ గైలాసమునన్
బృందారకసుందరు లా
నందంబునఁ బాడు ఖచరనందనుఁ డితఁడే.

231


క.

కడుఁబుణ్యుం డగు నీతని
మడియించిన శోకవహ్ని మడియుటకంటెన్
సుడిగొని జడనిధి నుడికెడు
బడబాగ్నిం బడుదుఁ గడిఁదిపాపం బడఁగన్.

232


సీ.

అనుడు నంతకమున్న తనయుకిరీటర
        త్నంబు కోడలియంకతలముమీఁదఁ
బడిన నాపడఁతుక పతిశేఖరం బని
        బెగడుచు ముందటం బెట్టె నంతఁ
గాంతయుఁ దాను నిర్ఘాతపాతం బైన
        తరుపుకైవడిఁ గూలి తడసి తెలిసి
ఫణిఫణామణి యని భావించి సుతునిది
        గాఁ జూచి తన్మృతి గలుగు టెఱిఁగి


తే.

మూర్ఛనొందుచు శోకాగ్ని మునిఁగి
యాలుఁగోడలుఁ దనతోడ నడలినడువ