పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

సింహాసన ద్వాత్రింశిక


క.

మృత్రుంజయుఁ డతనితపః
కృత్యమునకుఁ జిత్తవృత్తికిం దగఁగ జరా
మృత్యునివారక మగు ఫల
మత్యాదరణంబుతోడ నాతని కిచ్చెన్.

29


వ.

ఇచ్చి తిరోహితుం డైన.

30


ఆ.

అట్టిఫలము చేత నంది జనేశ్వరుం
డీశ్వరునకు మ్రొక్కి శాశ్వతముగ
నంగసిద్ధి గంటి నని యుల్లసిల్లుచు
మగిడి వచ్చునట్టి మార్గమునను.

31


చ.

పదములుఁ జేతులు న్ముడిఁగి పండులు డుల్లి నిజస్వరంబు గ
ద్గదికఁ బెనంగ నంగమున గ్రంథులు వాఱఁగఁ గుష్ఠరోగమున్
ముదిమియుఁ గూడి రూపు బలుపుం బొలియింపఁగ దైన్యజీవనా
స్పద మగుబ్రాహ్మణుండు జనపాలున కడ్డమువచ్చి యిట్లనున్.

32


క.

ముదిమియు రోగముఁ గూడం
బొదలెడు నిదె మేను నిలువఁబూనదు నాకున్
మది నెఱుఁగుదేని మం దీ
పదనున సమకూర్చి యిమ్ము పరమదయాత్మా.

33


ఆ.

అనిన నతనిఁ దోడుకొనిపోయి తనయింట
మందుమ్రాఁ కొనర్ప మదిఁ దలంచి
యాతఁ డంతదూర మరుదేర లేఁ డని
యాత్మఁ జూచి విక్రమార్కవిభుఁడు.

34


ఆ.

కలిగి పెట్టలేక కష్టుఁ డై న్న దు
ర్గుణుని పాపమునకుఁ గొలఁది లేదు