పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

209


మరణభయము లేనిమార్గంబు చేకుఱు
సిద్ధయోగనియతిఁ జెప్పుమనియెతిఁ.

23


మ.

అనిన న్న్యాసముతో జరామరణశూన్యం బైన మృత్యుంజయం
బను మంత్రంబును హోమతంత్రమును హవ్యద్రవ్యభేదంబు సా
ధనయోగంబుఁ గ్రమంబునం దెలిపి విద్యాదక్షిణానుగ్రహం
బున మన్నించి నరేంద్రు వీడుకొని విప్రుం డేఁగె వింధ్యాద్రికిన్.

24


సీ.

క్షితివరుం డిట యోగసిద్ధికై మంత్రిపై
        రాజ్యభారం బిడి రాముపగిది
జటిలుఁ డై మేన భస్మముఁ బూసి వల్కల
        ధారియై కాననాంతమున కేఁగి
ఋషిభంగి గంగలోఁ ద్రిషవణస్నానుఁ డై
        జపతపంబులఁ బురశ్చరణ చేసి
మంత్రపూతంబుగా మధుతిలదూర్వాజ్య
        హోమంబు జరుపుచు నేమమునను


తే.

నక్తము నుపోష్యమును నేకభుక్త మనఁగఁ
గలుగుదినముల సిద్ధయోగమున నుండి
కందమూలముల నశనకాంక్ష దీర్చి
వ్రతము చరియించె నట్లేకవత్సరంబు.

25


వ.

తదనంతరంబ యొకనాఁటి హోమసమయంబున.

26


క.

ఆహుతి వోయఁగఁ గాంతితి
రోహితుఁడై లోహితాశ్వరోచిఃపటలీ
రోహితుడై యాకుండము
లో హితుఁ డై నిల్చె నీలలోహితుఁ డంతన్.

27


వ.

తదాకారంబు గని సాఁగి మ్రొక్కి నిలిచిన.

28