పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

211


తన్ను మాని యైన ధర్మంబు చేసిన
యతనిపుణ్యమునకు నవధి లేదు.

35


క.

తుదిముట్టనిబ్రతుకున కా
పదఁ బొదలెడివాఁడు దానపాత్రం బని స
మ్మదమున నార్తులకొఱకై
సదయులు ప్రాణములు తొల్లి చాగము లిడరే.

36


వ.

అని తొల్లింటి రాజులం బ్రశంసించి తనలో శంకింపక సాహసాంకుండు మహోదారుండై.

37


క.

ప్రాణము లడుగఁడు వృద్ధ
క్షోణీసురుఁ డితఁడు మందుఁ గోరెడు దేహ
త్రాణము గావించెద నని
క్షోణీశుఁడు చేతిపండుఁ గోరిక నిచ్చెన్.

38


శా.

దివ్యం బౌఫల మిచ్చినం దిని ధరిత్రీనిర్జరుం డంతఁ గు
స్ఠవ్యాధిస్థవిరత్వదూరతమమై సంపూర్ణతేజఃకణా
భివ్యాప్తం బగు దివ్యదేహ మటుఁ బ్రాపింపంగ నిర్మోకము
క్తవ్యాళేంద్రుని భంగి నొప్పెఁ బతి చోద్యం బంది హర్షింపఁగన్.

39


క.

అర్థికి నీక్రియ నిచ్చి కృ
తార్థుండై కదలి వచ్చె నటుగావున న
ప్పార్థివునకు సరిపూనమి
వ్యర్థము నీతలఁపు భోజవసుధాధీశా.

40


క.

నావుడు భోజక్షితిపతి
భావంబునఁ జోద్యహర్షభరితుం డై ల
జ్జావనతవదనుఁ డగుచు హి
తావృతుఁ డై మగిడి పోయె నంతఃపురికిన్.

41