పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మహాత్మా విశ్వేశ్వరుండును విశ్వయోనియు విశ్వస్రష్టయు జగత్ప్రభుండును ననాది
నిధనుండును శ్రీమంతుండును భగవంతుండును నగు పురుషోత్తముండు సర్వగతుం డై
యుండియుఁ బ్రణామార్చనాదివిధంబుల నచటనచ్చట గోచరుండై ప్రతిష్ఠాపనా
మాహాత్మ్యంబున క్షేత్రప్రభావంబున నరకప్రీతివశంబునఁ బూజాధికృత్యంబున
సాక్షాత్కరుం డగుచుండు నని పౌరాణికజనంబువలన వినంబడుచుండుఁ బుణ్యశ్లోకుం
డును మహాభాగుండు నగునజ్జనార్దనుండు విశేషించియు నెచటనెచ్చట నధివసించి
ప్రకాశించుచుండుఁ బురాణజ్ఞుండవు సమర్థుండ ననఁబరగునీవలన నేతత్ప్రకారంబు
వినవలయు నని మనంబునం గౌతుకంబు విస్తరిల్లుచున్న యది నీ విది నాకుం దేట
తెల్లంబుగా నెఱింగింపవలయునని పార్థించిన విని యగస్త్యమహామునీంద్రుఁ డతని
కిట్లని తెలుపందొడంగె.

47

కథారంభము

క.

ధాత్రి న్మునివర విష్ణు, క్షేత్రంబులు పెక్కుగలవు సిద్ధం బీష
న్మాత్రం బెక్కువ యగు నొక, క్షేత్రము గల దది యెఱుంగఁ జెప్పెద వినుమా.

48


తే.

పుడమి గోదావరికిఁ దూర్పుకడను దుల్య, భాగకు నుదక్తటంబునఁ బశ్చిమమున
వారిరాశికిఁ గోసెఁడుమేర సర్ప, పురమహాక్షేత్ర మభిరామ గరిమ నలరు.

49


తే.

పుణ్యకాసారసహితంబు పుణ్యశీల, సంసృతము పుణ్యకాంతాప్రశస్త మగుచు
సర్వకామార్థదాయియై సర్పపురము, ఖ్యాతి నెలకొందు మూఁడులోకములయందు.

50


క.

నరుఁ డాక్షేత్ర మొకప్పుడు, పరువడి స్మరియింప విడుచు భవబంధము లా
సరసీజలముల మునిఁగిన, దురితౌఘము లెట్టి వైనఁ దొలఁగు మునీంద్రా.

51


తే.

నారదసరోవరంబు ననంతసరసి, ముక్తికాసారమును నన మూఁడుతీర్థ
ములు తరింపఁగఁజేయుఁబో తలఁచినపుడె, సర్వదురితపూర్ణు లౌ జంతువులను.

52


తే.

వరదుఁడు కృపాంబునిధి భక్తవత్సలుఁడు, భావనారాయణుండును దేవుఁ డచటఁ
దనర నారదమునికులోత్తమునిచేత, నున్నతిఁ బ్రతిష్ఠితుం డయి యున్నవాఁడు.

53


క.

మందారశాఖతెఱఁగున, వందారుకజనుల నెల్ల వరఫలముల నా
నందింపఁగఁ జేయుచు హరి, యందంబుగ బుధులు పొగడ నం దుండుఁజుమీ.

54


చ.

అనుటయు శౌనకుండు వినయాన్వితుఁడై కలశోద్భవుం గనుం
గొని మునివాథ నారదుఁడు కోరిక నేమిటి కందు నజ్జనా