పుట:సకలనీతికథానిధానము.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

277


సీ.

అచట మాయావరుం డనుభిల్లపతితోడ
        మైత్రి వాటించి తన్మందిరమున
వసియించి యొకరాత్రి యశి పట్టుక మృగాంక
        దత్తుఁ డరుగుచు నొక్క తస్కరునిని
దాఁకి యెవ్వఁడవన్న తస్కరుండను నీకు
        మిత్రుఁడ నయ్యెద మెలపుమనిన
వాని మావటివాని వాకిటివానిఁగా
        నెఱిఁగి కాముకవృత్తి నేగువాని


తే.

వెంటనే యేగి యమ్మహీవిభునిభార్యఁ
జండకేతుఁడు భూఘనచ్ఛిద్రమునను
జారుఁడై పొందఁగనుగొని సరభసమునఁ
జండకేతుని యింటికి జని విభుండు.

128


క.

ద్వారమునఁ గట్టినట్టి మ
యూరము మెడత్రాడు విడువను జ్వలుఁడగుచున్
జేరెన్ భీమపరాక్రమ
ధీరుండను మంత్రిసుతుఁడు తేజోనిధియై.

129


ఉ.

భీమపరాక్రమున్ సచివభీముని గాంచి మృగాంగదత్తుఁ డీ
వేమిటి కిట్టు లైతివన నిట్లనియెన్ నృప నిన్ను బాసి యు
ద్దామమహాటవిం దిరిగి దాహమునం గడుడస్సి శాల్మలీ
భూమిజమూలదేశమున భూమిపయింబడి మూర్ఛపోయినన్.

130


గీ.

వృద్ధపధికుఁడొకఁడు వేగమ ననుఁ దేర్చి
మత్ప్రయాసమెల్ల మదిఁదలంచి
తగుల దుఃఖపడగ దైవికమునకని
కథ వచింపఁదొడఁగెఁ గరుణవొడమి.

131