పుట:సకలనీతికథానిధానము.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

సకలనీతికథానిధానము


క.

కోసలపతి విమలాకరుఁ
డాసుభగుతనూజుఁడు కమలాకరుఁ డంగ
శ్రీసాక్ష్మాన్మథుఁడు వి
భాసితుఁడని యొక్కయర్థి పద్యము చదివెన్.

182


వ.

అది యెయ్యది యనిన.

183


ఆర్య:

కువలయభూషణమతులం
గుణనిలయం కవిసహస్రసమృష్టమ్
హంసావళి ర్న రమతే
కాంతం కమలాకరం విముక్త్వాద్య.

134


క.

అని యార్య చదువుటయు న
జనపసతి యవ్వంది నడిగె చదివినపద్యం
బున కేది కారణంబన
విను కమలాకర! తదీయవృత్తాంతంబున్.

135


సీ.

విదిశావురక్షమాత్రిదశేశ్వరుఁడు మేఘ
        మాలినాఁగలఁడు శ్రీమండనుండు
హంసావళీనామ యతనితనూభవ
        పంచాస్త్రుమోహనబ్రహ్మవిద్య
యాకన్యకను నర్తనాచార్యగృహమున
        వసియించితినిఁ జూచువాంఛ జేసి
యంతట నొక్కనాఁ డబ్బాల జనకుని
        యాస్థానమున నాట్య మాచరింప


గీ.

అంగహారాదివిద్య లభ్యాససరణి
దేశనృత్యమ్మునకు సమాదేశముననుఁ
దండ్రియునుఁ జూచువారలు దన్నుఁ బొగడ
లాస్య మొనరించె దృష్టివిలాస మమర.

136