పుట:సకలనీతికథానిధానము.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

239


చ.

వఱలు ననంతవర్మనృపు వశ్యునిఁగా నొనరించి దుష్టతల్
గఱపి ప్రజావిరుద్ధగతుగా నడిపింపుచుఁ జంద్రపాలుఁ డ
త్తెఱఁగు వసంతభానునకుఁ దెల్లముగా నెఱిఁగించి పంపె నీ
వఱిముఱి దండు రమ్ము వసుధాధిపు నీ కని నొప్పగించెదన్.

287


గీ.

అన వసంతభానుఁ డాజికి నరుదేరఁ
దా ననంతవర్మదండునకును
మొనకు ముందరకును నని సేయనొల్లక
చన ననంతవర్మఁ జంపి రపుడు.

288


వ.

ఇవ్విధంబున ననంతవర్మం జంపి వసంతభానుండు రాజ్యంబు గైకొని పాలింపుచున్న చంద్రపాలుం డప్పుడు.

289


ఉ.

ఆజి ననంతవర్మ తెగటారిన నీపరివార మెల్ల న
వ్వాజుల దంతులన్ యువతివర్గము రత్నవిభూషణంబులన్
రాజస మొప్పఁ గొల్లగొనిరారు భజింపగ నంచు నమ్మహీ
రాజున కింపుగా నొడివి రాష్ట్రవిభేదము చేసి యంతటన్.

290


క.

పరివారము వాఁడై తా
ధరణీశుని వెళ్ళగొట్టి తా రా జైనన్
బుర మేలు తొంటినరపతి
సరసిజముఖిసుతునిఁ గొంచుఁ జన నొకపురికిన్.

291


గీ.

ఇట్లు మాహిష్మతిపురి కేగి యందు
మంత్రి వసురక్షితుండున్న మందిరమున
కరుగుటయు వాఁడు విధవ నయ్యతివఁ బొందఁ
గోరుటయు సమ్మతంబునఁ జేరకున్న.

292