పుట:సకలనీతికథానిధానము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

సకలనీతికథానిధానము


వ.

తత్పుత్రు వధియింపందలచిన నయ్యనంతవర్మదేవి తనపుత్రుండైన వీని నా కప్పగించి రక్షింపుమనిన వీనిం గొనివచ్చి యీనూఁతికడ జలపానార్థంబు డిగ్గి యీనూఁతం బడి నీచేత నుద్ధరింపంబడితినని యిట్లనియె.

293


క.

నీ వామాహిష్మతిపురి
కీవేళ యరిగి జనని కెఱింగింపు మహీ
దేవునికడ నున్నాడని
యావలికథ యొక రహస్య మది యెఱిగింతున్.

294


సీ.

మారణమంత్ర సమర్శకంబగు నొక్క
        పువ్వులదండ యప్పొలఁతి కిమ్ము
త న్నెవ్వఁ డాశించెఁ దద్భూమిపాలుని
        గళమున వైచినఁ బొలియు నతఁడు
వెలఁదుక తనపుత్రు వింధ్యవాసినిసింహ
        మై దాఁచినది తెచ్చు నాత్మ(భువికి)
నని పంప నే నేగి యాపుష్పమాలిక
        యిచ్చి నందనుకథ యెఱుగజెప్పు


నంత వసురక్షితుఁడు (కాంత) ననుభవింప
నరుగదేరఁ బతివ్రత నైతినేని
వీఁడు మృతిఁ బొందునని దండ వేయుటయును
వ్రాలె నిర్జీవియై వసురక్షితుండు.

295


వ.

అద్దివసంబుననే నాడీజంఘుండను విప్రుండు కుమారునిం గొనితెచ్చె; పరివారంబును నద్దేవి మహాపతివ్రతయని సంతోషించిరి; నేనును నారాజపత్ని మేనత్తయగుట తదీయపుత్రునిం బట్టంబు గట్టి రాజ్యంబు సేయుచుండునంత.

296