పుట:సకలనీతికథానిధానము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

సకలనీతికథానిధానము


గీ.

నీరు చొరని పెద్దనీరాటిలోఁ జొచ్చి
యబ్జషండ వీథి నడఁగి యుండి
నీటఁ గ్రుంకు వెట్టునృపుకంధరముఁ ద్రెంచి
కడువలోనఁ బెట్టి కదలి యేను.

281


క.

ఆరాజుపత్నిఁ బొంది య
వారణరా జగుచు సింహవర్మకుఁ దోడై
యోరాజహంసనందన!
నీరూపము గంటిననుచు నృపు నలరించెన్.

282


వ.

రాజవాహనుండు విశ్రతుం డనువానిం జూచి నీ వెందు వోయితనిన నతం డిట్లనియె.

283


క.

చూపట్టెడు వింధ్యాటవిఁ
గూపముదరి నేడ్చు బాలకునిఁ గని యేలా!
వాపోయెదనిన మత్పిత
కూపంబున బడిన నిట్లు గ్రోల్చెద ననినన్.

284


గీ.

ఆధరామరేంద్రు నంధువు వెడలించి
ప్రహిఁబడంగ నేల ప్రాప్తమయ్యె
ననిన విప్రుఁ డనియె నన్న నే నొకరాజు
సచివవరుఁడ నౌదు చరిత వినుము.

285


వ.

వసంతభానుండను రాజు అనంతవర్మయను రాజుం గెల్వ నిశ్చయించు సమయంబున వసంతభాను ననుంగుమంత్రి చంద్రపాలుండు కపటోపాయంబునఁ దండ్రితో నలిఁగివచ్చినవాఁడై యనంతవర్మ ప్రధానుండైన విహారభద్రుండు కార్యసహాయుండుగా ననంతవర్మం గొలిచియుండినంత.

286