పుట:సకలనీతికథానిధానము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

సకలనీతికథానిధానము


క.

మామ నొడఁబరచి తనప్రియ
భామిని ననిపించికొనఁగఁ బయనము సేయన్
భూమిసురుఁ బాయజాలక
కామిని మృతిబొందె నట్ల కడచెన్ ద్విజుఁడున్.

283


క.

సతి ననుపు మనుచు వచ్చిన
యతఁడు ప్రియన్ బాయ లేక యసువులు విడిచెన్
మృతులగు మువ్వురలోపల
క్షితివర యే దద్భుతంబు చెప్పవె యనినన్.

284


ఆ.

భూమిసురుఁడు వైశ్యపుత్రియు సమరతిఁ
గలసి పాయలేమిఁ గలిగె చావు
అతివమగఁడు దానియనుభోగ మెఱుఁగక
విరహముననె తెగుట విస్మయంబు.

285


వ.

అనిన బేతాళుం డెప్పటియట్ల చనినఁ బట్టితెచ్చునెడ నొకకథ వినుమని యిట్లనియె.

286


సీ.

బ్రహ్మస్థ లాగ్రహారమున విష్ణుస్వామి
        సుతులునల్వురు భూమిఁ జూడ నరిగి
వచ్చుచో నొకయోగివరునిచే సంజీవ
        నాదివిద్యలు నేర్చి యడవిలోన
నొక్కసింహము చచ్చియున్న నందొకరుండు
        నస్థులు గూర్చె దానంత నొకఁడు
చర్మంబు గప్పి మాంసమును రక్తంబునుఁ
        బుట్టించెఁ బ్రాణంబుఁ బోసె నొక్క


తే.

డిట్లు నలువురు దమవిద్య లెఱుఁగుకొరకు
నాచరించిన గేసరి లేచి వారి
నలువురను బట్టి తినియె నాఁకలి యడంగ
వీరిలోఁ బాపి యెవ్వఁడు విక్రమార్క.

287