పుట:సకలనీతికథానిధానము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

113


వ.

అన నిట్లనియె.

288


క.

హీనమతు లెందఱైనను
గానంగా లేక సేయుకార్యము లెల్లన్
మానప్రాణార్థంబుల
హాని వెసం జేయు ననిరి యార్యజనంబుల్.

289


వ.

అట్లు గావున ప్రాణంబు వోసిన విప్రుసకు పాపంబు దగులుననిన దిరిగిచనినం బట్టితెచ్చునెడ నొక్కకథ వినుమని బేతాళుం డిట్లనియె.

290


సీ.

యజ్ఞశూలంబను నగ్రహారంబున
        యజ్ఞసోమద్విజు నాత్మజుండు
మృతిబొందుటయు (నుఁబరేతభూమికిఁ దెచ్చి)
        వనరంగ వామనుండను తపస్వి
యతనిదేహమునచొచ్చి యడలు మాన్చెదనని
        తలఁచి యప్పీనుఁగు తనువు చొచ్చి
నపు డేడ్చి పాతరలాడి ప్రవేశింప
        దనయునిఁ దోకొని చనియెఁ దండ్రి


తే.

తపసి యేటికి నేడ్చె నృత్యంబు సలిపె
ననిన నవ్విక్రమార్కుఁ డిట్లనియెఁ దన్ను
దల్లిదండ్రులు వెంచిన తనువు ముదిసి
విడువఁబడెనంచు నేడ్చెనప్పుడు తపస్వి.

291


వ.

బాలశరీరంబు చొచ్చి భోగింపఁగలిగెనని సంతసంబున నటియించె ననిన బేతాళుం డెప్పటియట్ల చనినం బట్టితెచ్చుసమయంబున నిట్లనియె.

292