పుట:సకలనీతికథానిధానము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

107


ఆ.

పెండ్లియాడుటయును బృథివీశుఁ డొక్కనాఁ
డతివఁ జూచి మన్మథాగ్నిఁ బొరల
మంత్రి దెలిసి తనదు మగువ నొప్పించిన
నన్యకాంత పాపమని తలంచి.

250


వ.

కైకొనక విరహతాపంబునం బ్రాణంబువిడిచె నమ్మంత్రియుం దనస్వామి మృతుండయ్యెనని తానును నట్లయయ్యె వీరిలోన నధికుం డెవ్వఁ డనిన విక్రమార్కుం డిట్లనియె.

251


క.

చక్కనిదైనను గుణములు
మిక్కిలిగా హృదయమిచ్చి మెలఁగెడిదైనన్
మక్కువ సేయక పరసతి
దిక్కుగనుంగొనినవాఁడె ధీరుఁడు సుమ్మీ.

252


వ.

అట్లు గావున రా జెక్కుఁడనిన బేతాళుం డెప్పటియట్ల న్యగ్రోధంబున కరిగినం బట్టితెచ్చుసమయంబునఁ గథ వినుమని యిట్లనియె.

253


ఆ.

పుష్పపురమునందు భూసురుండొక్కఁడు
సూర్యదేవళంబు చొచ్చి యందు
క్షుత్పిపాస నొగులఁజూచి యోగీశ్వరుం
డతని కన్న మిడుదు నని దలంచి.

254


వ.

ఒక్కపురంబు నిర్మించి యొక్కబాలిక చేత నన్నము పెట్టించినం దృప్తుండై యయ్యోగీంద్రున కిట్లనియె.

255


క.

ఈవిద్య నాకు నొసఁగుము
ధీవల్లభ! యనిన నీవు స్థిరచిత్తుడవై
సేవింపక ఫలియింపదు
నావుడు నేనట్ల సేతునని కైకొనుచున్.

256