పుట:సకలనీతికథానిధానము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

సకలనీతికథానిధానము


క.

ఆతని యుదారమహిమకుఁ
బ్రీతుండై మెచ్చి ఖగవరిష్ఠుండు సుధా
ప్రీతునిగఁ జేసి ఫణిసుతుఁ
జేతః ప్రియ మలరఁ గాఁచె చిత్తం బలరన్.

245


క.

మెచ్చితి నంబుదవాహన
యిచ్చెద నే మడుగు దనిన నిది మొదలుగ, నీ
కిచ్చయని ఫణుల మెసఁగకు
చచ్చిన యురగములఁ దినుము శాంతాత్ముఁడవై.

246


వ.

అనిన నిచ్చితినని గరుడుండు యధేచ్ఛం జనియె గరుడ జీమూతవాహనులలో నెవ్వం డధికుం డనిన విక్రమార్కుం డిట్లనియె.

247


ఆ.

అధికదాతయైన యంబుదవాహనుఁ
డిచ్చు ప్రాణమైన నేమి చెప్ప
నాకలైన మెసఁగ నరుదెంచు గరుడుండు
దినక కాచునదియె ధీరగుణము.

248


వ.

అనినం బరచినం బట్టితెచ్చునెడ నిట్లనియె.

249


సీ.

కనకపురంబునఁ గలఁడు విశారదుం
        డనురాజు వైశ్యుని యముఁగుదనయ
కామిని జూచి యభ్బూమినాధుఁడు పెండ్లి
        యాడెద లక్షణ మరయుఁ డనిన
దీని బెండ్లాడిన మానవేంద్రుఁడు రాజ్య
        తంత్రంబు నుడుగును దగదటంచు
నవనినిర్జరు లది యవలవణం బన్న
        రా జొలకున్న నారాజు మంత్రి