అంతర్జాతీయ వ్యాపారము : ఒడంబడికలు
రికా దిగుమతులపై గల దిగుమతి సుంకములు 48శాతము నుండి 23 శాతమునకు తగ్గినవి. ఈ వర్తకపు టొడంబడికల వలన చాలవరకు ముందుగా సూహించిన యుద్దేశములు ఫలవంతములైనవి. దిగుమతి సుంకములు పెరుగుటమాని తరుగుట కారంభించినవి. ఈ పునాది పైననే యుద్ధానంతరకాలమున ఈ సమస్యను పరిష్కరించుటకు వలసిన ప్రయత్నములు జరిగినవి.
అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడికల చట్టము ఆమోదించిన కాలము నుండియు (1934) అమెరికా దేశము అంతర్జాతీయ వ్యాపారమును పెంపుజేయు పద్దతుల నవలబించుచు వచ్చినది. అమెరికా 1934 నుండి 1939 వరకు గడచిన కాలములో ఇరువది యొక్క దేశములతో వ్యాపారపు టొడంబడికలను గావించుకొని అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకుగల అంతరాయములను నిర్మూలించుటకు గట్టిప్రయత్న మొనర్చినది. యుద్ధ కాలమునందే జరిగిన 'అట్లాంటిక్ ఛార్టరు' అను బ్రిటను అమెరికాల సంయుక్త ప్రకటనమునందు అన్ని దేశములకు వ్యాపారమునందును, ముడిసరకులు సేకరణ యందును సమానావకాశములను కల్పించుటకు అనువుగ తీర్మాన మున్నది.
అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకు యుద్ధానంతర కాలములోని ప్రయత్నములు :- 1943-45 మధ్య కాలమున బ్రిటను, అమెరికా, కెనడా దేశముల ప్రతినిధులు అనేక పర్యాయములు సమావేశమై సమాలోచనములను జరిపిరి. 1945లో అమెరికాదేశము అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకును, సర్వ దేశములయందును నిరుద్యోగ నిర్మూలనము (Full Employment Policy) నకును కొన్ని సూచనలు గావించెను. ఈ సూచనలను అనేక దేశముల ప్రభుత్వములు పరిశీలించి 1947 సంవత్సరాంతమున 'హవానా' యందు జరిపిన సమావేశమున చర్చించినవి. ఈ సమా వేశమున 56 దేశముల ప్రతినిధులు పాల్గొనిరి. 1948 వ సంవత్సరము మార్చి నెలనాటికి "అంతర్జాతీయ వ్యాపార పథక నియమావళిని(International Trade organization charter) 58 దేశము లామోదించినవి. ఈ నియమావళి ననుసరించి అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడికలు రెండు రెండు దేశములమధ్యగాక అన్ని దేశములును పాల్గొనుటకు అవకాశము కలిగిన యొడంబడికల మూలమున అంతర్జాతీయ వ్యాపార విస్తరణమే, ప్రధానాంకమయినది. అంతి యేకాక 'అంతర్జాతీయ ద్రవ్యనిధి' (International Monetary Fund) సక్రమముగసాగి, వివిధదేశములమధ్య ఋణపరిష్కారము నిర్నిరోధముగ జరుగవలయుననిన ఇట్టి యొడంబడికలు అవసరమని గుర్తింపబడినది.
వ్యాపారమును, దిగుమతి సుంకములనుగురించిన సాధారణసమ్మతి (General Agreement on Trade and Tariff లేక Gatt) : పై ప్రయత్నముతోపాటు వాణిజ్యసమ్మతుల చట్టము (Trade Agreements Act) క్రింద అమెరికా, 1947లోనే, 15 దేశములతో సంప్రదింపులు ప్రారంభించెను. ఆతరువాత మరి 8 దేశములు కూడా ఈ 'జినీవా' సంప్ర దింపులలో పాల్గొనినవి. ఈసంప్రదింపులలో ఒక ముఖ్య విశేషము గలదు. సంప్రదింపులు రెండుదేశముల మధ్య జరుగును. అందు ఒక దేశము తాను రెండవదేశమునుండి దిగుమతి చేసికొను సరకులపై గల నిర్బంధములను తొల గించుటకు గల అవకాశములను పరిశీలించి, తన అంగీకారమును తెలుపును. అట్లు తాను తొలగించిన నిర్బంధముల వలన కలుగులాభము, సంప్రదింపులు జరిపిన రెండవదేశమే కాక, సమా వేశములో పాల్గొనిన అన్ని దేశములకును గలుగును. అట్లు 1947 వ సంవత్సరము అక్టోబరుమాసాంతమునకు 123 సంప్రదింపులు జరిగి 50,000 సరకులపై గల నిర్బంధములు కొంతవరకు తొలగింపబడినవి. ఈ సమా వేళముల ఫలితములు, వ్యాపారమును, దిగుమతి సుంకములను గురించిన సాధారణ సమ్మతులలో (General Agreement on Trade and Tariff, 1947) పొందుపరుపబడినవి.
రెండు సంవత్సరముల తరువాత 1949 లో 'అన్నెసీ '(Annecy) లో 31 దేశముల ప్రతినిధులు సమావేశమయిరి. ఆ సమా వేశములవలన కలిగిన ఫలితములుకూడ ఆ తరువాత Gatt లో పొందుపరువబడినవి.
ఈ Gatt వలన ప్రపంచ వ్యాపారములో సగము భాగమునకు లాభము కలిగినది, ఈ సమాలోచనములు ఇంకను కొంతకాలమువరకు అప్పుడప్పుడు జరుగుచునే యుండును. ఈ సమాలోచనముల ఫలితముగ అంత