Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/800

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆపస్తంబుడు

సందర్భమున ఆనెగొంది మరల గోల్కొండ నవాబుల భాగమునకు వచ్చెను. అప్పటినుండి క్రీ. శ. 1950 వరకు అది ఆసష్టాహీలకు సామంతరాజ్యముగనుండెను. ఇతర mసంస్థానములవలె, జాగీరులవలె ఆనెగొందియు ఆ సంవత్సరము హైద్రాబాదు రాష్ట్రములో లీనమై పోయినది. ఆనెగొంది పట్టణము ఆనెగొంది సంస్థానమునకు రాజధానిగా తనరారుచుండెను.

కొ. భూ.

ఆపత్థ్సితి చట్టనిర్మాణము - Emergency Law :- అసాధారణ పరిస్థితులయందు ప్రజలను, రాజ్యమును రక్షింపవలసిన బాధ్యత ప్రతి నవీన రాజ్యాంగ ప్రణాళిక యందును పేర్కొనబడి యున్నది. ఆపత్తునందు భూపాలుడో, రాష్ట్రపతియో, ముఖ్యమంత్రియో, నేనాపతియో మరియే యితర సమర్థుడో రాజ్యమును రక్షింపవలసిన విధియున్నదికదా ! ఆపత్తు ఆ సన్నమయినప్పుడు నిర్ణ యింపబడిన విధానము "ఆపత్ట్సిత న్యాయ" మందురు. ఈ అధికారము భారత రాజ్యాంగ ప్రణాళికలో రాష్ట్రపతియందు నిలుపబడినది.

ఈ సందర్భములో 'ఆపత్తు' అనగా మూడు విధముల స్థితమైన ఆపద :

1, దేశాంతర యుద్ధము, లేక దేశములో విప్లవము.
2. రాజకీయ కారణములచే రాజధానులందు రాజ్యకార్య స్తంభన.
3. ద్రవ్యలోపముచే గలుగు ప్రమాదము.

I బాహ్యాభ్యంతర యుద్ధవిప్లవములచే గలుగు ప్రమాద మాసన్నముకాగా రాష్ట్రపతి ప్రకటన యొకటి (Proclamation) గావించి, యావత్తు రాజ్య నిర్వాహకములను తనయందాపాదించుకొని, యావచ్ఛాసవాధికారమును లోకసభయందు నిలువునట్లుగా ప్రకటన చేయును. అట్టి సమయమందు కేంద్రాధికారమే ప్రమాణముగా వర్తింపగలదు. కేంద్ర ప్రభుత్యోద్యోగులే సర్వాధికారములను నిర్వర్తించుచు రాష్ట్రపతికిని, లోక సభకును బాధ్యులయియుందురు, ఆ సమయమందు లోకసభకు శాసనాధికారము విపులమై, నిరంకుళమై యుండగలదు. ఒక వేళ లోకసభ 'సమా వేశములో ' లేనిచో, రాష్ట్రపతి రెండు మాసములవరకు స్వంతముగా ఆపత్ట్సితస్థితిని నిర్వహించును. కాని వెంటనే లోకసభను సమావేశపరచి లోకసభ యొక్క యంగీకారమును పొంద వలయును.

II రాజ్యాంగ స్తంభన  : విశ్వాసరాహిత్య తీర్మానముల వలనను, రాజకీయ వర్గములలో ఒండొరుల వైషమ్యముల వలనను ఏ రాజధాని యందైనను మంత్రివర్గము స్థిరముగా పొసగజాలక యుండెనేని యట్టి పరిస్థితిని 'రాజ్య కార్యస్తంభన యని చెప్పవలయును. (Failure of Constitutional machinery). అట్టి పరిస్థితినోక యాపత్తుగా గ్రహించి రాష్ట్రపతి ప్రకటనగావించి యా రాష్ట్రము యొక్క నిర్వాహ కాధి కారము తనయందును, శాసనాధికారము లోక సభయందును నెలకొల్పవలయును. కాని న్యాయాధి కారములను మాత్రము ఆ రాజధాని యొక్క ఉన్నత న్యాయస్థానము (హైకోర్టు) నుండి తొలగించరాదు. రాష్ట్రపతిచేసిన ఈ ప్ర క ట న ను లోకసభ యంగీకరించినచో ఆరు మాసములవరకు విళంబించవచ్చును. ఈ కాలమం దారాష్ట్రములో నుండిన రాష్ట్ర శాసనసభకు శాసనాధికారములు జాలవు.

III ద్రవ్యావత్తు : ఏ దుష్టకాలమందైనను దేశములో ద్రవ్యలోపముగలిగి భారతమున కన్యదేశములలో పరపతి(Credit) తగ్గినను రాష్ట్రపతి తద్విషయమయిన 'ప్రకటన' నొకటి గావించి ప్రభుత్వోద్యోగులు, న్యాయాధిపతులు మున్నగువారల యొక్క వేతనములను, ఒరుంబడులను (allowances) తగ్గించి ద్రవ్యాపత్తు నుండి దేశమును రక్షించును. మరియు రాష్ట్రపతి స్వతః పరిశీలించి సవరణలు గావించి, ఉచితరీతిగా అంగీకారమిచ్చును.

ఈ పై విధములయిన ప్రాథమిక హక్కులకు బాధ కలిగినదని ఆరోపణలు చేయుచు న్యాయ స్థానములకు విన్నపములు చేయరాదు.

బు. సు

ఆపస్తంబుడు :-

    ఏతద్దేశ ప్రమాతన్య సకాశాదగ్ర జన్మనః
    స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః'
    వ్యవస్థితార్య మర్యాదః కృతవర్ణాశ్రమ స్థితిః
    త్రయ్యాహి రక్షితో దేశః ప్రసీదతి నసీదతి.
    (మనుస్మృతి)