ఆంధ్రులు - నృత్యకళ (చరిత్ర)
విదములోని నాయికను సాత్మిక సంచారులతో రంజింప చేయుచు, శాస్త్రముల నెరిగిన విద్వాంసుని ప్రశ్నలకు
సమాధానము చెప్ప గలిగెడు సామర్థ్యముగల నర్తకి మాత్రమే సభలో గజ్జెగట్టి పదము పట్టుల కర్హురాలు.
ఏకపాత్ర నృత్యము — ఇదే నేటికాలములో భరత నాట్య మను పేరుతో ప్రసిద్ధిగాంచినది. ఈ నృత్యరీతి సంస్థానము లున్న ప్రదేశములలో పెంపొంది ప్రచారము లోనికి వచ్చినది. తంజావూరు, కాళహస్తి, కార్వేటి నగరము, వేంకటగిరి, పిఠాపురము, పెద్దాపురము, కొల్లాపురము, విజయనగరము మొదలయిన సంస్థానములలో ఆ రాజుల పోషణములో వృద్ధిచెందినది. ఇందును క్షత్రియ సంస్థానము లందలి (విజయనగరము, పెద్దాపురము మొదలయినవి) విద్యకును, వెలమరాజుల రాజ్యములలోని (తంజావూరు, వెంకటగిరి, పిఠాపురము, బొబ్బిలి మొదలయినవి) విద్యకును చాల భేద మున్నది. ఈ పద్ధతి నృత్య మందు ఒకే నర్తకి పాల్గొనును, నాట్యాచార్యు డామె నాడించును. నృత్యము 'మేళప్రాప్తి' లేక 'అలరింపు' అను నృత్తముతో ప్రారంభమై 'జావళీ' లేక 'తిల్లాన'తో ముగియును. ఈ నృత్య సంప్రదాయము నృత్తముతో ప్రారంభింపబడి, నృత్యము ప్రదర్శించిన తరువాత అభినయముతో ముగియుచున్నది. భారత దేశములోని నృత్యరీతు లన్నింటిలోను ఈ నృత్య సంప్రదాయమందు మాత్రమే, నృత్త నృత్య అభినయములు శాస్త్రీయ దృక్పథములో, చక్కగా సమపాళ్ళలో పోషింపబడుచున్నవి.
సంస్థానములందు 'చర్మకట్టు వాద్యనృత్య"మని మరొక నృత్తరీతి ప్రచారములో నుండినది. ఈ నృత్యరీతియందు సుమారు పండ్రెండుమంది డోలు (శృంగి భేరి) వాయిద్యకులు, సన్నాయి పాటగాండ్రు ఇరుప్రక్కల ఎదురెదురుగా నిలబడి వాయిద్యముల వాయింతురు. వారిమధ్య ఏబది లేక అరువదిమంది శ్వేతాంబర ధారిణులయిన దేవదాసీలు బారులుదీరి నిలువబడి యుందురు. సన్నాయి వాద్దెగాండ్రు అతి విలంబితలయలో 'చౌక వర్ణము”లను వాయించెదరు. శృంగిభేరి వాద్యకులు ఆ వర్ణము యొక్క లయను దెల్పుచు, కాల పై కాలములలో ప్రస్తారము చేయుచు వివిధ జాతులందు జతులను కట్టి వాయించి తీర్మానించెడివారు. నర్తకిణు లందరును ఏక కాలమందు ఆ పాట యొక్క లయ ననుసరించి అడవులు పట్టి, పై కాలమందు తీర్మానించెడివారు. ఇది లయ ప్రధానమైన బృంచనృత్త విశేషము.
నృత్యకళ, ఈ విధముగా కులవిద్య, వృత్తి విద్యగా తయారయి ప్రత్యేక తరగతులకు చెందినవారే దీనిని ఆరాదించుటచే, సంఘములోని యితరజాతులవారు ---స్రీ పురుషులు తమయొక్క వినోదార్థము, పర్వదినము లందు అందరును ఒక చోట గూడి సంతోషముగా కాలము గడుపుటకు కొన్ని నృత్యముల నేర్పరచుకొనిరి. అవియే జానపద నృత్యములు. ఈ నృత్యములకు శాస్త్రముతో ఎక్కువ సంబంధములేదు. ప్రత్యేక శిక్షణ, సాధన అవసరము లేనట్టియు, అందరికిని అందుబాటులో నుండెడు విద్యలు ఈ జానపద నృత్యములు. అట్టివే పల్లెలందలి స్త్రీలు ప్రదర్శించెడు గొబ్బి, కోలాటము, బ్రతుకమ్మలాట మొదలైనవి. తెలంగాణములోని మారుమూల ప్రాంతములలో కొన్ని తెగలకు చెందిన పురుషులు ప్రదర్శించెడు కోలాట నృత్యమందు కొంత పాండిత్యము గానవచ్చును. అట్లే విశాఖ జిల్లాలోని 'తప్పెట గుండు' నృత్యము, కృష్ణా గుంటూరు జిల్లాలలోని 'గుఱ్ఱము ఆట'. గుఱ్ఱము ఆట ఒక చిత్ర నృత్య రీతిగా పేర్కొనవచ్చును, గుఱ్ఱమునకు, మృదంగ వాయిద్యము ననుసరించి తాళ లయలలో జాతీర్ణముగా నృత్యమాడుటకు శిక్షణ ఇవ్వబడును. ఉత్సవములందు, ఊరేగింపులందు ఇవ్విధముగా శిక్షణనొందిన గుఱ్ఱము కాళ్ళకు గజ్జెలు కట్టి, పాటకుడు పాడే గీతము, తాళ లయల ననుసరించి మృదంగజతులకు గుఱ్ఱముచే నృత్యమాడించెదరు. ఇవి గాక మాయ గుఱ్ఱములు, బుట్ట బొమ్మలు మొదలైన వానిలో మనుష్యులు లోపల ఉండి వాని నాడింతురు.
తెలంగాణములో జోగుజాతికి చెందినవారు ప్రదర్శించెడు 'జోగాట' ముఖ్యముగా పేర్కొనదగిన నృత్యము. ఈ నృత్యము డప్పుల వాయిద్యముల ఆధారముతో చేయబడును, 'జోగాట' మాలమాదిగ కులముల వారిలో ఎవరైన చనిపోయి నప్పుడు శవమును శ్మశానమునకు గొనిపోవు నపుడు ముఖ్యముగా ఆడుదురు. వీరి నృత్యరీతు లన్నింటిలోను 'పిండోత్పత్తి' క్రమమును వర్ణించు నృత్యము