ఆంధ్ర వాజ్మయ చరిత్రము - I
శ్రీ వాణీంద్రామ రేంద్రాచ్చి౯త (ద్రార్చిత) - అనిన యతిసరిపోవును. (శ్రీ...చి) గాని శ్రీ వాణింద్రామ రేంద్రార్చిత యని నవీనరీతిగా పాఠనిర్ణయదృష్టితో ముద్రించిన యతి యెట్లును సరిపోవదు. చూడుడు. పూర్వరీతిగా వ్రాసిన వైముద్రిత పాఠము. శ్రీవాణిం ద్రామరేంద్రాప్పి౯త అని వలపలిగిలకు సంప్రదాయముతో వ్రాయవలసినరీతిగా వ్రాసినచో యతి తప్పుచున్నది.
తెలుగు భాషలో యతి ప్రాసలకును, లిపి పరిణామ క్రమమునకును సన్నిహిత సంబంధము కలదని నిరూపించుటకు పై వలపలిగిలక సంప్రదాయ మొక్కటియే చాలును. ఈ నియమము తిక్కన కాలమునాటినుండి సడలినది.
3. c . అర్ధానుస్వారము లేక అరసున్న :- ప్రాచీన లిపిలో అరసున్న లేదు. మొదట వర్గపంచమాక్షరములు, ఆవెనుక బిందువులును వ్రాయబడుచుండెడివి. వర్గపంచమాక్షరములలో బిందువే తెలుగులో నియతముగా నిలుచునని యాంధ్ర లాక్షణిక సంప్రదాయము. కేతన మొదలగు ప్రాచీన వైయాకరణులు, పూర్ణబిందువులే లిఖింపబడుననియు, నవి యూది పలుకుట, తేలి పలుకుట యను నుచ్చారణ సంప్రదాయముచే రెండువిధములైన దనియు తెలిపిరి. తాళ పత్రములమీది వ్రాతయందును ఇది కానరాదు. మొట్టమొదట అచ్చుపడ్డ పుస్తకములలోను ఇది కానరాదు. ప్రాచీన గ్రంథములు నవీనరీతిని ముద్రించుకాలమున క్రీ. శ. 1840 ప్రాంతమునుండి అరసున్న సంజ్ఞ ఏర్పడి క్రీ. శ. 1858 నుండి బాల వ్యాకరణము మూలమున నేటి వ్రాతలో స్థిరత్వము సంపాదించినది. ఇది గ్రాంథిక భాషలో నియతముగా పాటింపబడుచున్నను వ్యావహారిక భాషలో పాటింపబడుట లేదు.
4. ఋ, ౠ,ఌ,ౡ . :- ఇవి రు, రి యని యిరు తెరగుల వ్రాతలలో నుండేడివి. ప్రాచీన కాలమునుండి కాలమువరకు కవులు, యతిస్థానమున, 'ఋ' కు 'రు' తోడను 'రి' తోడను యతులు వాడిరి. కొందరు లాక్షణికులు మొదటిదాని నంగీకరింపలేదు. దేశ సంప్రదాయము ననుసరించి రెండును సరియైనవియే. దీనిని గూర్చి, అప్పకవీయ పంచమ ముద్రణ పీఠికయందును భాషా పరిశోధన ప్రయోగ విశేషములు అను గ్రంథమునను విపులముగా చర్చింపబడి యున్నది.
ని.వేం
ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I (క్రీ. శ. 1503 వరకు) :- ఋగ్వేదమునందును రామాయణ భారతము లందును ఆంధ్రుల ప్రశంస కనవచ్చుచున్నది. మౌర్య చంద్రగుప్తుని కొలువునకు గ్రీకు రాయబారిగా వచ్చిన మెగస్తనీసు ఇండీకాలో ఆంధ్రుల బలప్రాభవములను గూర్చి వ్రాసి యుండెను. క్రీస్తు శకమునకు ముందు వెనుకల సుమారు నాలుగున్నర శతాబ్దుల కాలము ఆంధ్ర రాజులు శాతవాహను లను పేరుతో పెద్ద సామ్రాజ్యమును పాలించి యుండిరి. ఈ విధముగా అతి ప్రాచీన కాలమునుండియు ఆంధ్రజాతి ఉండినట్లు తెలియుచున్నను, ఆంధ్ర భాషయని తరువాత ప్రసిద్ధి వడసిన తెలుగు, మాతృకయైన మూల ద్రావిడమునుండి యెప్పుడు విడివడి ప్రత్యేక రూపమున పరిణామ మొందుటకు మొదలిడెనో చెప్పుటకు వీలుగా కున్నది. శాతవాహను లాంధ్రులైనను తమ శాసనము లందు ప్రాకృతభాషనే వాడి యుండిరి. వారి తరువాత ఆంధ్రదేశమును పాలించిన ఇక్ష్వాకులు, బృహత్ఫలాయనులు, ఆనంద గోత్రికులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, మున్నగువారి శాసనములలో కూడ ప్రాకృతమో, సంస్కృతమో వాడబడియుండెను. కాని యందలి వేపూరు, విరిపఱ, పెణుక పట్టు, తెన్దులూరు, శాన్టికొన్ట, చెన్చేరువు, కంబుగా ళ్చెరువు, కడాకుదురు, మున్నగు గ్రామములు కొన్ని తెలుగు పేర్లుగా కానవచ్చుటయు, శాతవాహన రాజులలో నొకడైన హాలుడు కూర్చిన గాథా సప్తశతిలోని గాధలలో ప్రాకృతపదములనడుమ నక్కడక్కడ పొట్ట, పిల్ల, అత్త, కరణి, పంది మున్నగు తెలుగు శబ్దములు దొర్లియుండుటయు, అమరావతీ స్తూపమునందలి ఒక రాతిపలకపై నాగబు అను తెలుగు ప్రత్యయముతో కూడినమాట గోచరించుటయు చూడ క్రీస్తు శకారంభమునుండియు తెలుగుభాష దేశమున వ్యవహారములో నుండెనని వ్యక్తమగుచున్నది. చాళుక్య రాజులకు, ముందుండిన తెలుగు భాషాపరిస్థితినిగూర్చి యింతకంటె నేమియు చెప్పజాలము,