అంటువ్యాధులు (ఆయుర్వేదము)
(7) కర్దమవిసర్పము : కఫపి త్తజనితము. నోటి యందును అంగుటినుండి గొంతునందును కలుగును, దీనిని "డి ఫ్తీరియా” యని పాశ్చాత్యు లనిరి. ఇది గొంతునుండి పెద్ద పేగు ద్వారా హృదయము, ఆమాశయమువరకు వ్యాపిం
చుటయు ప్రత్యేకముగ ఆమాశయమునందే జనించి గొంతు మూసికొనిపోవుటయు, ఆమాశయమునందును, గొంతునందును తీవ్రవేదన కలిగించుటయు గలదు. మహా భయంకరమగు వ్యాధి.
4. విస్ఫోటము : ఇది మూడు విధములు. (1) కాలస్ఫోటము: వాతోత్తరముగా కలది. శరీరమంతయు వేద నాత్మక ముగ ఉసిరిక కాయల వలె పెద్ద బొబ్బలు లేచును. (2) గళస్ఫోటము : వాతకఫోద్భవము. పైలక్షణములు కలిగి కంఠమునందు మాత్రమే బహిఃప్రదేశమున కలుగును, (3) విషస్ఫోటము: త్రిదోషజనితము. వీపునందును, వక్షస్థలము నందును కలుగును. దుశ్చికిత్సితము.
- ఇట్లీ మొ త్తము...13
- పూర్వోక్తములు....209
- ఉభయము ఏకరాశిగా ధ్రువాంకము 222
ఇట్లు రెండువందల ఇరవై రెండుగా పరిగణనకు తేలిన ఈ అంటువ్యాధులలో రెండువందల తొమ్మిది వ్యాధులు తీవ్ర వేదనాత్మకములుగాని, సద్యః ప్రాణహరములుగాని కావు. ఇవి తెలియని బాధలను కలిగించుచు కాలాంతర ప్రాణహరణములుగా నుండును. జనవదోద్వంసకములగు పదుమూడు వ్యాధులును ఆశుచికిత్సావశ్యకత కలవి, తీవ్ర వేదనాత్మకములును, సద్యః ప్రాణహరణములును అయి యున్నవి. ఈ వ్యాధులకు "క్షుద్ర వ్యాధు "లనియు వాడుక. ఇందొక "మశూచికము” తప్ప మిగిలిన “విస్ఫోట, విషూచి, విసర్పములు” మహాత్వరితముగ ప్రాణములు తీయును. "మశూచికము” కొలది దినములు బాధించి చంపుటగాని, మనుజుని సౌందర్యహీనునిగా చేయుటగాని, చేయి, కాలు, కన్ను, ముక్కు, చెవి మొదలగు అవయవములయం దేదేని చెడగొట్టుటగాని చేసి విడుచును.
మిగిలిన విస్ఫోట, విసర్పములు, నాలుగైదు దినముల నుండి ఒక వారము వరకు మనుష్యుని చంపుటకు గడువిచ్చును. “విషూచి” మాత్ర మీ చంపుటయందు నిర్దాక్షిణ్యముగ కొన్ని గంటలకన్న ఎక్కువకాల మవకాశమీయదు. భయంకరములగు ఈ వ్యాధుల నిదాన చికిత్సలన్నియు చరక, సుశ్రుత, వాగ్భట, బృందమాధవ, మాధవనిదాన, బసవరాజీయ, యోగరత్నాకరములందును, దైవవ్యపాశ్రయ చికిత్సాధారముగ కర్మవిపాకమునందును చూడనగును.
జనపదోద్ధ్వంసక ములగు ఈ వ్యాధులు పుష్యమాసాంతము వరకుగల వర్షాశరద్ధేమంత కాలములయందు తరుచు కలుగుచుండుటయు, ప్రతిపల్లెపట్టులను, విశేషముగా పట్టణములను, సంగులసమరమువలె అల్లకల్లోలముగ చేయుటయు జరుగుచుండును. ఫాల్గున చైత్రము లాదిగా గల శిశిర వసంత గ్రీష్మములందు విషూచి మహాభయంకరముగ వ్యాపించి తాండవ మాడుచుండును. శీఘ్రముగ బలమగు చికిత్స లభించనిచో ఈ విషూచి నూటికి నూర్గురను చంపియే తీరును.
శాక్తేయు లీజనపదోర్ధ్వంసక ములగు వ్యాధులు దేవతా మహత్వము కారణముగా కలుగు నని దేవీతంత్రముల యందు వర్ణించిరి.
దేవీభాగవత, త్రిపురా సిద్ధాన్తశేఖర, బిన్దులక్షణము లిందుకు ప్రమాణము. అందీవ్యాధులకు గ్రామదేవతారాధనము, జంతుబలి, జపహోమాదికములు, శాంతికరములుగా చెప్పబడినవి. కొలుపులనియు, జాతరలనియు ఈ విశ్వాసమున జనబాహుళ్యమునం దీనాడును వాడుకగ జరుపబడుచునే యున్నవి. అందుచేత వ్యాధులు దేశవ్యాప్తములు గాకుండుటయు, శాంతిచెందుచుండుటయు చూడబడుచున్నది సత్య మేదైనను దేవతారాధనమును, ఈ జపహోమాది శాంతికర్మముల నాచరించుటయు ఆయుర్వేద మంగీకరించినది. ఇందు చరక ప్రమాణ మిట్లు కలదు. విమానస్థానము, 3 వ అధ్యాయము, పదుమూడవ శ్లోకమునుండి 214 శ్లోకము వరకునుగల అభిప్రాయమిచట సూచింపబడినది.ప్రమాణమును కాంక్షించు వారు మూలమును చూడనగును. ఆ అభిప్రాయమిది:
వికృతిచెందిన వాయు, జల, దేశ, కాలములు స్వభావముగ ఒక దానికంటే నొకటి బలమైనవిగా నుండును. గాలి