Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నజీవ పరిపిర్తన వ్యాధులు కీళ్ళలోను అరచేతి కీళ్ళలోను సోడియం యూరేటు చేరి కుఁటితనము ఏర్పడవచ్చును. తీవ్రపరిస్థితిలో టించర్ కాల్ సీకమును ఇచ్చిన యెడల అది నొప్పిని పోగొట్టును. మున్ముందు ఈ వ్యాధి రాకుండుటకు రక్తమూత్రా మ్లము పెరుగకుండ చూచుట అవసరము. వారమునకు 3, 4 సార్లు సింకోవేన్ మాత్రలను సేవింపవలెను. ఇది చాల విషసంబంధమైన ఔషధము కావున దీని నుపయో గించుటలో మెలకున అవసరము.

అతి స్థూలత : ఈ పరిస్థితి ఈ క్రింది సందర్భములలో వచ్చును. (1) పిట్ విటరీ మాంసగ్రంథి వలనను (2) థైరాయిడ్ మాంసగ్రంథిలో ద్రవము ద్రవము తగ్గుట వలనను (8) ఓవరీస్ అనగా స్త్రీలకు రజస్సు ఆగుట వలనను. కాని సామాన్యముగా అతిసూలత అతిగా తినుటవలన వచ్చును. రోగి ఆహారమును మిగుల తగ్గించు కొనుచు తన శరీరమందలి క్రొవ్వును వ్యయపరచు కొనుచు అదనపు బరువు తగ్గునట్లు యత్నము చేయ వలెను. యాంపిటమిన్ గోలీలు తీసికొన్నచో మితిమీరిన ఆకలి ఉండదు. వంకాయలు, టొమేటోలు మొదలగు కూరగాయలను ఉపయోగించినచో అవి తక్కువ కెలో రీల (Calories) ఆహారము నిచ్చుటచే స్థూలత తగ్గు టకు అవకాశమున్నది. క్రొవ్వు యొక్క ఆహారజీవపరివర్తనమునందలి అక్ర మములు :- ఇందు గాచర్సు వ్యాధి సాధారణమైనది. ఇందు ప్లీహము, కాలేయము మొదలగు అవయవములు క్రొవ్వు కణములతో నిండును. నీమన్ ఫిక్స్ వ్యాధియు, స్కుల్లరు వ్యాధియు ఇట్టివే. కాని నిలువయుండు క్రొవ్వుపదా ర్థములలో తేడా కలదు. ఇందులకు గల తెలియదు. మిశ్రితాహారము (మిక్సెడ్ డైట్) : మనము దినచర్యలో శక్తిని వ్యయింతుము. మన ఆహారమునందలి కెలోరీలు దీనిని సరఫరాచేయును. పెరిగెడు పిల్లలకు ఎక్కువ ఆహారము అవసరము. శరీరము యొక్క ఒక్కొక్క పౌను బరువునకు కనీసము శ్రీ గ్రాము మాంస కృత్తులు కావలెను. పాలలోను, జంతువుల మాంస కృత్తులలోను జీవసంధాయకములగు జంతుక ఆమ్లములు గలవు. పిండిపదార్ధములు, మాంసకృత్తులు, 202 గ్రామునకు 4 కెలోరీల శక్తిని ఇచ్చును. క్రొవ్వు గ్రాము 1కి 9 కెలోరీల శక్తిని ఇచ్చును. పిండిపదార్థములు లేని క్రొవ్వు, కీటో సెస్కు కారణమగును. కావున మన ఆహారము మిశ్రముగా నుండవలెను. అందు పిండి పదార్థములు, మాంసకృత్తులు, క్రొవ్వు, లవణములు, విటమినులు, కూరగాయలు, ఉన్నప్పుడే సరియగు శక్తి లభించును. మనదేశమునందు కేవలము బియ్యమునే తినెడు వారికి మాంసకృత్తులు తక్కువగా లభించును. శాకాహారులకు మాంసకృత్తులు ఇంకను తక్కువగా లభించును. పాలద్వారమున ఈలోటును కూడా తీర్చుకొన వలెను. సామాన్య మానవునకు సగటున రోజునకు 2500 - 8000 కెలోరీల ఆహారము కావలెను. శ్రమించు కార్మికునకు రోజునకు 4000 కెలోరీల ఆహారము కావలెను. కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా తినిన యెడల వాటి మూలమున ఆహారమున సెలులోస్ అను పదార్థము లభించి మలబద్ధకము తగ్గిపోవును. నిరాహారత (స్టార్వేషను) : నిరాహారులకు అన్న జీవ పరివర్తనక్రియ యావత్తును తలక్రిందగును. శరీర మందలి క్రొవ్వు నిలువలు వ్యయమగును. పిండిపదార్థ ర్ధములు, క్రొవ్వు మండిపోవుటచే కెటోసెస్ వ్యాధి వచ్చును. మూత్రములో ఎసిటోన్ పదార్థములు కాన నగును. క్రొవ్వునుండియు ఆమినో ఆసిడునుండియు గ్లూకోసు తయారుచేయు శక్తి కాలేయమునకు కలదు, కాని ఈశ క్తి పరిమితమైనది. నిరాహారతవలన రోగియైన వ్యక్తికి హఠాత్తుగా సంపూర్ణాహారము నిచ్చుట ఎంత ప్రమాదకరమో ఇటీవల యుద్ధకాలములో వంగదేశ క్షామము రుజువుచేసినది. అందువలన అతడు తప్పక మరణిం చును. అతనికి మొదట గ్లూకోసునీళ్ళు, ఉప్పు, నీళ్లుక లిపిన పాలు, పండ్లరసము ఇచ్చి, అతని జీర్ణశక్తి పెంపొందిన పిమ్మట మెలమెల్లగా క్రమక్రమముగా అతని ఆహారమును అధికము చేయవలెను. దీర్ఘకాలముగ అసంపూర్ణ ఆహారముపై బ్రతికిన వానికి రక్తములో మాంసకృత్తులు తగ్గిపోవును. అందు వలన శరీరము వాచిపోవును. వైటమిన్ లోపమువలన పాండురోగము కలుగు రోగముల చిహ్నములు కాన వచ్చును. మాంసకృత్తుల అభివృద్ధికి, రక్తవృద్ధికి లివర్