అన్నంభట్టు
జనులు వలసిన వివిధ వస్తువులు నెంచుకొనునట్లు బజారు ధరల పరిశీలించి వ్యాపారముచేయువారు వస్తువుల ఉత్పత్తి విషయమును నియమించుటకై సంఖ్యాశాస్త్రమును ఉపయోగించుటకుబదులుగా దానిని ప్రజలను మోసగించుటకై వినియోగించుచుందురు. ఇట్టి దురుపయోగములకై సంఖ్యాశాస్త్ర నైపుణ్యమును ఉపయోగించుట తగని పని.
డా సి. రా.
అన్నంభట్టు :- అన్నంభట్టు ఆంధ్ర బ్రాహ్మణుడు. వేదశాస్త్ర పండితుడు. ఇతని తండ్రి తాత ముత్తాతలును మహావిద్వాంసులు. శాస్త్రగ్రంథములను నిర్మించినవారు. అన్నంభట్టు తండ్రి తిరుమలభట్టు. అతడు సర్వతోముఖ యాజి యను బిరుదము కలవాడు. సంధ్యావందన భాష్యమును వ్రాసెను. అతని తాత మల్లుభట్టు. 'అగ్నిహోత్రభట్టను బిరుదము కలవాడు. ఆలోకస్ఫూర్తి యను న్యాయగ్రంథమును, తత్త్వవివేచనమను వేదాంత గ్రంథమును మహాభాష్య టీక యను వ్యాకరణ గ్రంథమును 'ఆతడు రచించెను. అన్నంభట్టు ముత్తాత లోక నాథభట్టు. 'ద్వాదశాహ యజ్వ' యను బిరుదము కలవాడు. వీరందరికి మూలపురుషుడు రాఘవ సోమయాజి అని ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమున కలదు. మరియొక యాధారమును బట్టి అన్నంభట్టు కౌశికసగోత్రుడు. అతని మూలపురుషుడు అద్వైతాచార్యుడగు రాఘవ సోమయాజి, తండ్రి మేలిగిరి తిరుమలాచార్యుడు, అన్న సర్వదేవుడు అని తెలియుచున్నది. ఇందు అన్నంభట్టు యొక్క తాత ముత్తాతల పేళ్లు లేవు. పై రెండాధారములందును అన్నంభట్టు అన్నంభట్టు గానే పేర్కొనబడెను. రెండు తావులందును రాఘవసోమయాజియే మూలపురుషుడని కలదు. భేద మేమన ఒక చోట అన్నంభట్టు తండ్రి తిరుమల భట్టనియు, రెండవ తావున తిరుమల ॰చార్యుడనియు కలదు. ఈ ' ఆచార్య ' 'భట్ట ' శబ్దములు ఆనాడు నిస్తుల పాండిత్యముకలవారి కొసగ బడుచుండెను.అందుచేత తిరుమలభట్టు, తిరుమలాచార్యుడు ఇరువురు నొకరేయని నిశ్చయింపతగియున్నది.
విజయనగర రాజ్యస్థాపనానంతరము ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబము లనేకములు తుంగభద్రాదక్షిణ దేశమునకు వెడలెను. అట్టివాటిలో అన్నంభట్టు కుటుంబ మొకటి. అన్నంభట్టువంశమునందలి అత్యంత ప్రాచీన పురుషులు మొదట మామిళ్లపల్లి యను గృహనామముతోను, పిదప గరికపాటి లను గృహనామముతోను వ్యవహరింపబడుచు వచ్చిరి. అన్నంభట్టు వంశమునందలి ప్రాచీన పురుషులకు మామిళ్లపల్లి యను నింటి పేరు మామిళ్లపల్లి యను పేరుగల యొకానొక గ్రామమును బట్టి యేర్పడి యుండవచ్చును.
అన్నంభట్టుపూర్వులు నివసించిన మామిళ్లపల్లి యను గ్రామ మెద్ది యని విచారింపతగినది. గుంటూరు మండలస్థమైన తెనాలి తాలూకా యందు మామిళ్లపల్లి యను గ్రామమొకటి కలదు. ఇందు నేటికిని మామిళ్లపల్లి యను నింటి పేరుకల పెక్కు బ్రాహ్మణ కుటుంబములు కలవు. ఈ బ్రాహ్మణులు వెలనాటి శాఖకు చెందినవారు. తెలంగాణమున మహబూబునగరం జిల్లా యందలి అచ్చం పేట తాలూకాలో మరియొక మామిళ్లపల్లి కలదు. నేడిందు మామిళ్లపల్లియను నింటి పేరు కల బ్రాహ్మణులు లేరు. ఐనను అన్నంభట్టు తెలగాణ్య శాఖకు చెందిన బ్రాహ్మణుడయియుండుట చే ఆతని వంశమునందలి ప్రాచీనులీ తెలంగాణము నందలి మామిళ్లపల్లి యందే నివసించి ఉండిరనియు, మామిళ్లపల్లి యందుండుటచే మామిళ్లపల్లి వారనియు తెలంగాణమునం దుండుటచే తెలగాణ్యులని ప్రసిద్ధినొంది యుండిరనియు ఊహింపవచ్చును. నేడు వారచ్చట లేకుండుటకు కారణము వారందరును అన్నంభట్టు తలిదండ్రుల కాలమున స్థలాంతరములకు వలస పోయి యుండుటయే కావచ్చును. ఇట్లు తెలంగాణము నందలి మామిళ్ల పల్లి నుండి వలసపోయిన మామిళ్లపల్లి వారిలో కొందరు కడపజిల్లాలోని ప్రొద్దుటూరునందు స్థిరపడిపోగా అన్నంభట్టు వంశమునందలి పెద్దలు ఉత్తర ఆర్కాటునందలి చిత్తూరునకు సామీప్యమున నున్న గ్రామమువ నివాసమేర్పరచుకొనిరి. అక్కాలమున తెనుగునాడు ఉత్తర ఆర్కాటు మండలము వరకు వ్యాపించియుండెను.
అన్నంభట్టు బాల్యమున విద్యాశూన్యుడయి యుండెననియు, తండ్రి యాతనిని ప్రహరించెననియు, అప్పుడాతడు స్వగ్రామ త్యాగమొనర్చి తొలుత కొండవీటి పాఠశాల యందు ప్రవేశించి యచట వేదశాస్త్రముల నభ్య