Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అచ్చుయంత్రముల నిర్మాతలు అల్లికవలెనుండు ముద్రణయంత్రములను (వీటిపై కాగిత ముయొక్క రెండువైపులను ఒకేసారి అచ్చు వేయుటకు వీలగునట్లు) నిర్మించెను. అచ్చుపడిన కాగితములను మడత పెట్టుటకు ముక్కోణాకారపు సాధనమును కల్పనచేసెను. 3. గూటెన్డెర్గు జొహాన్నిస్, లేక, హెన్ని:- జొహా న్నిస్ గూటెన్ బెర్గ్ అనువాడు కదలించుటకు వీలైన ముద్రాక్షరములతో ముద్రణ విధానమును కల్పించిన జర్మను కల్పకుడు. ఇతడు క్రీ. శ. 1400 సంవత్సర ప్రాంతమున మెయింజ్ అనుచోట జన్మించి, క్రీ. శ. 1488 వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 23 వ తేదిని అచటనే చనిపోయెను. అతని బాల్యదశ నుగూర్చి మన కేమియు తెలియదు. 1484 వ సంవత్సరమున అతడు స్ట్రాస్ బర్గులో నివసించుచుండెను. రహస్యమైనవియును, అద్భుత మైనవియు నగు తనకళలనన్నిటిని వారికి బోధించు నట్లును, వాటిని వారి ఉమ్మడి ప్రయోజనము కొరకు వినియోగించునట్లును 1486 వ సంవత్సరమున అతడు ఆండ్రియాడై జెల్మ్ మున్నగు వారితో ఒడంబడిక చేసి కొనెను. 1488 వ సంవత్సరాంతమున డ్రైజెల్మ్ చనిపోవుటచే ఆకం పెనీ ఒడంబడికకు భగ్నముకలిగెను. తరువాత 1448 వ సంవత్సర ప్రాంతమున అతడు మెయింట్కు తిరిగివచ్చి, వెంటనే ధనికస్వర్ణ కారుడగు జోహాన్ పాస్టుతో భాగస్వామిగా చేరెను. పొస్టు ఒక ముద్ర ణాలయమును స్థాపించుటకు వలయుధనము సమకూ ర్చెను. ఆముద్రణాలయమునందు లాటి భాషలో నున్న బైబిలు గ్రంథము మొదట అచ్చువేయబడెను. 1450 వ సంవత్సరమున ముద్రణము ప్రారంభింపబడి 1455 వ సంవత్సరమున పూర్తిచేయబడిన 'మజారి౯ బై బిలు' అను గ్రంథము చలనాత్మక ముద్రాక్షరములతో ముద్రింప బడిన ప్రథమగ్రంథముగా తెలియుచున్నది. కొన్ని యేండ్ల తరువాత ఈసంబంధము విడిపోయినది. పొస్టు ముందుగా పెద్దమొత్తములను పెట్టుబడి పెట్టెను. వాటిని తీర్చవలసిన దని ఆతడు గూటెజు బెర్గును నిర్బంధించెను. గూటెజా బెర్గు వాటిని తీర్చుటకు శక్తి లేకయో. ఇష్టము లేక యో ఊరకుండుటచే, ఈ విషయము న్యాయస్థానమునకు తీసి కొని పోబడెను. దాని ఫలితముగా ముద్రణాలయము ఫాస్టునకు అధీనమయ్యెను. అతడు దానిని అభివృద్ధిచేసి, 86 జెర౯షీమ్ వా స్తవ్యుడగు పీటర్ షోఫర్ అనునాతనితో చేరి ఉపయోగించుచుండెను. మెయింజ్ వా స్తవ్యుడగు కోనార్డుహమ్మర్ అను నొక వకీలు పోషకత్వముచే ఆమరుసటి సంవత్సరము గూటె బెర్గు మరలనొక ముద్రణాలయమును స్థాపింపగలిగెను. ఆముద్రణాలయమునుండి 1480 వ సంవత్సరములో ఒక చక్కని "కాథొలిక"', 1454, 55 వ సంవ త్సరములలో "లెటర్సు ఆఫ్ ఇండర్జెన్స్"అను గ్రంథములు వెలువడినవి. ఆతని ముద్రణాలయమునుండి వెలువడిన ఏగ్రంథము పైనను గూటెజ్ బెర్గు యొక్క పేరు కనిపిం చదు. అతని స్నేహితులుగాని, పోషకులుగాని ముద్రణ విషయమగుకల్పనల సందర్భమున గూబెజ్ బెర్గు నామము పేర్కొనరు. గ. శి. శా. అచ్చు యంత్రములు - ముద్రణకళ: (1) ముద్రా క్షరములనుగాని ముద్రాక్షరములు అచ్చుముక్కలనుగాని కూర్చి వాటిని ముద్రణము కొరకు పంక్తులలోను వరుస లలోను (columns) ఏర్పరచు అన్ని తరగతుల యంత్ర ములను సాధారణముగా అచ్చుకూర్పు యంత్రములు అని వర్గీకరింపవచ్చును. ఈ యంత్రములలో ' పంక్తి ముద్రణము · (Linotype), ' ఏక ముద్రణము' (Mono- type) అనునవి ప్రధానమయినవి. చారిత్రకముగా చూచినచో కానెక్టికట్ వాస్తవ్యు డగు విలియం చర్చ్ అను నాతడు కనిపెట్టిన ముద్రాక్షర యంత్రము మొట్టమొదటిది. ఇంగ్లాండులో 1822 వ సంవత్సరమున దాని కల్పనాధికారము పొందబడినది. అత డొక ' మీటల బల్ల' (Key Board) ను నియోగించి ముద్ర_అక్షరములను కాలువలలో (Channels) చేర్చి యుంచెను. 1848-1872 వ సంవత్సరము వరకును ఆమెరికా సంయుక్త రాష్ట్రములలో 57 అచ్చుకూర్పు యంత్రములకు కల్పన రక్షణాధికారములు (Patents) ఒసగబడెను. గ్రేటు బ్రిటనులో కూడ సుమారు ఆ సంఖ్య లోనే కల్పన రక్షణాధికారములు పొందబడినవి. 1. వంక్తి ముద్రణయంత్రము :- అచ్చును కూర్చుట, పోత పోయుట అను రెండు పనులను చేయునట్లు ఇది కల్పింప బడినది. విడివిడిగా నున్న అక్షరములను పంక్తులనుగా