Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంత ర్వేది జ పడు రాజ్యము లీన్యాయస్థానము యొక్క మధ్యవర్తి త్వము న పేక్షించిన యెడల న్యాయాధీశులు తమ అభి ప్రాయములను వ్యక్తపరచుచుందురు. అంత ర్జాతీయ న్యాయశాస్త్రమును గురించి సమితికి సంబంధించిన అంగ ములు సలహాలను కోరినయెడల అట్టి సలహాల నొసగుట కిది సంసిద్ధ ముగనున్నది. ఐక్యరాజ్యసమితి కార్యములన్నియు మూడు ప్రధాన సూత్రములతో సమన్వయము కావలసియున్నది. అది తల పెట్టు కార్యమేదియు రాజ్యముల సర్వస్వామ్యమును (Sovereignty) నిరోధించునదిగ నుండరాదనునది మొదటి సూత్రము. ఎట్టి పరిస్థితులలో కూడ ఏరాజ్యము యొక్క ఆంతరింగిక (Domestic) వ్యవహారములలోను సమితి జోక్యము కలిగించుకొనరాదనుట రెండవసూత్రము. అగ్రరాజ్యము లై దింటి యొక్క అంగీకారమును పొందిన గాని శాంతిభద్రతలస్థాపించుటకు కావలసిన కార్యములను సమితి కార్యనిర్వాహక సభ యగు భద్రతా సంఘము చేయరాదనుట మూడవసూత్రము. ఇట్టి సమన్వయము కుదురుట సులభసాధ్యముగా కనబడుటలేదు. అయినను, సమితి ఆదర్శసిద్ధికై అందరు చిత్తశుద్ధితో కృషి సలుపుట ప్రపంచ క్షేమమున కవసరము, మా. వెం. రం- అంతర్వేది:- ఆంధ్ర దేశమును పవిత్రముగావించు గోదావరీనది రాజమహేంద్రవరమునుండి, కాశ్యప (తుల్యభాగ), అత్రి (కోరింగనది), గౌతమి, భరద్వాజ, కౌశిక, జమదగ్ని, వశిష్ఠ అను ఏడుపాయలుగా చీలి సముద్రముతో సంగమించుచున్నది. వీటిలో భరద్వాజ. జమదగ్నిపాయ అంతరించినవి. కౌశిక, తుల్యభాగలు చిన్న కాలువలవలెనున్నవి. యాత్రికులీసప్తసంగమస్థలము లందును స్నానముచేయుటకు "సప్తసాగర యాత్ర" చేయుదురు. వీటిలో మిక్కిలి పడమటిది వసిష్ఠాసాగర సంగమము. ఇచ్చట వసిష్ఠపాయకు ఎడమఒడ్డున అంత ర్వేది క్షేత్రమున్నది. ఇది నరసాపురమను ప్రాచీన చారిత్రక పట్టణమునకు ఏడుమైళ్ళ దూరములోనున్నది. క్రీ.శ. 1802 వ సంవత్సరమున పోలెండు దేశస్థులగు డచ్చివారు ఈప్రాంతమునకు ఓడవర్తకము కొరకు వచ్చిరి. ర్తకముకొరకు మన వలందువారు అనుచుండిరి. దేశస్థులు హాలెండువారిని సముద్రములోనిల్చిన వలందుల ఓడలనుండి గొప్పపడవలు అంతర్వేదిమీదుగా నరసాపురమునకు జేరుచుండెను. ఓడ లకు మార్గసూచనకొరకు డచ్చివారు అంతర్వేదిదగ్గర ఒక గొప్ప స్తంభమును కట్టిరి. ఇది దీపమున్న స్తంభము కాదు. పెద్దఓడలు ఒడ్డునకు రాకూడదని హెచ్చరిక తెల్పుటకీ స్తంభముప యోగించెడిది. ఈ ప్రాంతమును పిమ్మట ఆక్ర మించుకొన్న ఆంగ్లేయులీ స్తంభమును బాగుచేయించిరి. 1951 వ సంవత్సరమున ఆగస్టులో వచ్చిన ఉప్పెనలో ఈ స్తంభపు పై భాగము పడిపోయినది. అప్పుడు సముద్ర మించుమించుగ నొక మైలుదూరము భూమిమీదికి చొచ్చు కొనివచ్చినది. పూర్వము సముద్రజలమున కరమైలు దూరముననుండెడి యీ స్తంభమిప్పుడు సముద్రములో నున్నది. దీనికి కొంతదూరములోనుండెడి ఆంజనేయ స్వామి ఆలయమునుగూడ సముద్రుడు మ్రింగివేసినాడు. ఆలయము కూలిపోయినది. ఆంజనేయ విగ్రహము అంత ర్వేది చెరువుగట్టున నొక ఇటుకగుడిలో భద్రపరుపబడినది. ఈప్రదేశమున కృతయుగమున బ్రహ్మ నూరేండ్లు యాగముచేసి యజ్ఞశాలలో అంతర్వేది కాస్థలమున నీల కంఠేశ్వరుని ప్రతిష్ఠించి క్షేత్రపాలకునిగావించెను. పిమ్మట వసిష్ఠ మహర్షి యిట నాశ్రమమేర్పరచుకొని గోదావరి నుండి వసిష్ఠపాయను తీసికొనివచ్చెనట. హిరణ్యాక్ష పుత్రుడగు రక్తలోచనుడు ఈశ్వరవర గర్వమున కన్ను గానక, విశ్వామిత్ర ప్రేరితుడై వసిష్ఠపుత్రులను చంపగా, వసిష్ఠుడు విష్ణువును ప్రార్థించెను. హరి, లక్ష్మీనృసింహ రూపమున మునికి ప్రత్యక్షమై, మాయాశ క్తియు తన సోదరియునగు అశ్వారూఢాంబ (గుఱ్ఱాలక్క) రాక్షసుని రక్తము భూమిమీదబడకుండ దననాల్కలో పీల్చి వేసి తోడ్పడుటవలన, ర క్తలోచనుని సంహరించెను. పిమ్మట రాక్షసరక్తమును గుఱ్ఱాలక్క విడిచివేయగా రక్తకుల్యయను పేరున ప్రవహించెను. వసిష్ఠుని ప్రార్థనచే లక్ష్మీనృసింహస్వామి అర్చారూపమున నట నిల్చిపోయెను. వసిష్ఠుడు లక్ష్మీ నృసింహ విగ్రహమును ప్రతిష్ఠించి అర్చా దులుగావించెను. ఈస్థలమునకు కొంతదూరమున రక్షణగా ఆంజ నేయస్వామినిగూడ వసిష్ఠుడు ప్రతిష్ఠించెను. అస్వామి រឺ ఆలయమే 1951 లో సముద్ర గర్భమునపడేను. నది 63