పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

కాదు. అష్పాఖ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం మర్యాదపూర్వక పలకరింపు లేకపోగా అష్పాఖ్‌ను అనుమానించారు. ఆ అనుమానాలు-అవమానాలను అష్పాక్‌ ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్రయత్నాలు కొనసాగించారు.

ఈ పరిస్థితి ఆనాడు కేవలం ఒక్క అష్పాఖ్‌కు మాత్రమే పరిమితం కాదు. మాతృదేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా భావించిన ముస్లిం విప్లవకారులలో పలువురికి ఈ చేదు అనుభవాలు తప్పలేదు. అద్వెతీయ దేశాభిమానం కలిగిన వ్యక్తిగా ఖ్యాతిగాంచిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు కూడా ఇటువంటి దురదృ ష్టకర పరిస్థితి ఎదురయ్యింది. బెంగాల్‌కు చెందిన విప్లవ గ్రూపు అనుశీలన సమితిలో మౌలానా అబుల్‌ కలాం సభ్యత్వం కోరారు. మౌలానా ముస్లిం కావడం వల్ల ఆయన్ను అనుమానించి సమితిలో సబ్య త్వం ఇవ్వనిరాకరించడం జరిగింది. గత్యంతరం లేక మౌలానా స్వయంగా దారుల్‌ ఇర్షాద్‌ అనే విప్లవ సంఘాన్ని స్థాపంచారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేయగలమని దారుల్‌ ఇర్షాద్‌ సభ్యుల చేత పవిత్ర గ్రంథం ఖుర్‌ఆన్‌ సాక్షిగా ఖిద్ధిపూర్‌ స్మశానంలో ప్రమాణం చేయించారు. ఆ తరువాత కొంత కాలానికి బెంగాలు విప్లవకారులు మౌలానాను గౌరవించటమే కాకుండా, ఆయన సలహాల మేరకు విప్లవ కార్యకలాపాలను పలు ప్రాంతాలకు విస్తరింపచేశారు.

ఈ విషయాలను మౌలానా ఆజాద్‌ తన ఇండియా విన్స్‌ ఫ్రీడం గ్రంథంలో విస్తారంగా తెలిపారు. ఆ తరువాత మౌలానా విప్లవబాటలో కొంత దూరం ప్రయాణించి మహాత్మా గాంధీ ప్రభావంతో అహింసోద్యమాన్ని అనుసరించిన విషయం తెలిసిందే.

(‘ In fact all the revolutionary groups were then actively anti -Muslim…At first they did not fully trust me and tried to keep me outside their inner council..’,-India Wins Freedom, Moulana Abul Kalam Azad, Orient Longman, Delhi, 1998, Page. 5)

అష్పాఖుల్లా ఖాన్‌ ముస్లిం యువకుడు కనుక ఆయన నిజాయితిని, నిబద్ధతను పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌ శంకించారు. ఒక్కసారైనా అష్పాఖ్‌తో మాట్లాడడానికి బిస్మిల్‌ కనీసం ఇష్టపడలేదు. ఆయనను దళంలోకి తీసుకోలేదు. పలుమార్లు ఆయన బిస్మిల్‌ తిరస్కారానికి గురయ్యారు. అయినా అష్పాక్‌ మాత్రం పట్టువదల్లేదు. బిస్మిల్‌

17