పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/743

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

672

శ్రీరామాయణము

—: భరతుఁడు నందిగ్రామమున రామపాదుకల బురస్కరించుకొని రాజ్యమును బాలింపఁబూనుట ;—


"యీ యయోధ్యాపురం - బిఁకనేల నాకు?
వోయి నందిగ్రామ - మున వసించెదను
రాముఁబాసిన విచా - రముఁ గాకయున్న
నేమిటం దీరు నిం - కేమియు నొల్ల
రామచంద్రుఁడు నాకు - రాజగుగాన
నామహాత్ముని రాక - నాత్మ నుంచెదను 10400
మీ మనంబుల నిది - మేలని యెంచి
నేమింపుఁడ"నిన మం - త్రివరేణ్యు లనిరి.
"అన్నదమ్ముల మే - ర లన్నియు నీకె
వన్నెగా కితరు లె - వ్వరు సాటినీకు?
నీచిత్త మెట్లుండె - నీవట్ల చేసి
యాచంద్రతారార్క - మగుకీర్తిఁ గనుము.
సీతా విభుండని - చిత్త మెఱుంగు
నాతని హృదయ మీ - వరసి వచ్చితివి
సరిపోయినట్లు వి - చారించి కొనుము
భరత రాజకుమార! - పలు మాటలేల?” 10410
అన సారథిని రథం - బరిది వేగమున
గొనితెమ్మనుఁడు మిన్ను - గోరాడు చున్న
తళు తళుక్కున కోవి - దారధ్వజంబు
గల రథంబతఁడు చెం - గటఁ దెచ్చినిలుప
నందరతల్లుల - యనుమతి చేత