పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

47

    రాముఖానుఁ డక్బరుఁ బెక్కు గురువుల
           వేర్వేఱ నియమించి వివిధ విద్య
    లభ్యసింపఁగఁజేసె, నాతని వేయి క
           న్నులఁజూచి వేయిచేతులను గాచి
    ధరణి రాజ్యం బూర్జితము చేసెఁ గాబూలు
           చేకొనె గాంధారసీమ గెలిచె
           
గీ॥ జాన్ పురం బజమీర్ ప్రదేశములు గొనియె
    గ్వాలియరు పట్టుకొనియె మార్వారు నొంచె
    క్షణము విశ్రాంతిఁ గొనక రాజ్యములు గెలిచె
    నక్బరున్నతి పరమ లక్ష్యముగ నుంచి. 194

--అక్బరు సమగ్ర రాజ్యాధికారము నొందుట.--

మ॥ అరుదెంచెన్ బదునెన్మిదేడులగు ప్రాయం బప్పు డక్బర్ వసుం
    ధరఁ దానేలఁ దలంచె సేవకతతిన్ ద్రవ్యంబు నర్పించి సం
    బర మొప్పారఁగ నాత్మరక్షకుని నా మక్కాకుఁ బంపించె ద
    గ్గర నబ్డూరహిమాను దత్సుతుని వేడ్క నిల్పి పోషించుచున్. 195
    
సీ॥ ఆజాను దీర్ఘ బాహార్గళయుగళుఁడు
           ద్యత్పద్మ పత్రనేత్రముల వాఁడు
    ఘనసార్వభౌమ లక్షణ లక్షితుండు ప్ర
           సన్నమనోహ రాస్యంబు వాఁడు
    బలశోభితారోగ్యవచ్చరీరుండు నీ
           రద సామ్యగంభీరరవము వాఁడు
    శాంతిప్రధాన వర్చశ్శోభితుండు ద
           యాపూర్ణ మృదు హృదయంబు వాఁడు
           
గీ॥ కష్టము సహింపఁగల ధైర్యగరిమ వాఁడు
    వితరణ వికాసముల వాడు-వేయు నేల
    భరతఖండ మేలిన సార్వభౌము లందు
    నింతవాఁ డింక లేఁడనునంత వాఁడు. 196