పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


సీ॥ అంచెలమార్చుచు నశ్వంబులను, స్వారి
                  యిరువదైదామడల్ పఱచియుండె
    ఘూర్జరమ్మునఁ ద్రోవ గొప్ప బెబ్బులిరాఁగ
                  నద్దానిఁజేత జొప్పడఁచియుండె
    విడక 'ఖండిరా' వనెడి మత్తకరినెక్కి
                  యైదామడలదూర మరిగియుండె
    నాడు సింగము పిల్లలైదు మండుటెడారి
                  యందుఁబైఁ బడఁ బీచమణఁచి యుండె
                  
గీ॥ నిరువురను దనసందిట నిఱికి కొనుచుఁ
   గోట గోడలపై నెక్కి దాఁటి యుండె
   నప్రతీప ప్రతాప ధైర్యములు దేహ
   బల మితని సొమ్మనుచు మెచ్చ మెలఁగియుండె. 197
   
మ॥ భగవాన్ దాసుఁ డొసంగె నాత్మసుత నక్బర్ నేత కుద్వాహ మం
    దగరాడ్ధీరుఁడు వాని సోదరు సుతుండౌ మానసింహుడు వీ
    ర గరిష్ఠుండయి ఢిల్లిఁ జేరి పరరాష్ట్రశ్రేణులన్ గెల్చి కీ
    ర్తి గురుత్వంబు వహించి యక్బరుకడన్ దీపించె సేనానియై. 198
    
సీ॥ ముప్పాలుప్రజ హైందవులుగాన వారి సే
                 మము తన కెప్డు సేమమని తలఁచె
    నని జయించుచుఁ బట్టుకొనినవారిని బాని
                 సలఁజేయు రట్టంబు నిలిపివైచె
    యాత్రలకేగు భక్తావళితోఁ బన్ను
                 గొనరాదనుచు దానిఁ గొట్టివైచె
    జిరకాలముగను వేసెడు జుట్టుపన్ను న్యా
                 యవిరుద్ధమని దాని నవలఁ ద్రోసె
                 
గీ॥ హైందవంబున యవనరాజ్యంబు నిలుస
   నెన్నియత్నముల్ వలయుఁ దానన్ని చేసె
   మంచుమలనుండి కన్యాకుమారి దాఁక
   వసుధ నెల్లఁ చాలింప నక్బరు దలంచె. 199 199