46
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
బులివంటి ప్రోడ హేముఁడు క్షణక్షణమును
దండెత్తి రాగాలు ద్రవ్వుచుండ
గీ॥ నల్ల కాబూలుకొ ఱ కేగ ఢిల్లీ పోవు;
ఢిల్లీకై చూడఁ గాబూలు చెల్లి పోవు
వెనుక నూయి ముందర గోయి యనుట యయ్యె
శౌర్యధనుఁడు బైరాంఖాను సైన్యపతికి. 190
క॥ తొలుత సికందరుసాహిని
గలియుచు బై రాముఖాను కల్యాణూ రన్
స్థలమున నోడింపఁగ నతఁ
డలఘుగతి శివాల కద్రు లందున డాగెన్ 191
.
సీ॥ లక్ష పదాతి దళంబు కరుల్ వేయి
దినవెంట నేతేర దండు వెడలి
హేముఁ డాగ్రాపురికేగి చేకొనిదాని
నవల ఢిల్లీపురం బాక్రమించె
బైరాముఖానుఁ డక్బరు ససైన్యముగ సి
ద్ధంబైరి పానిపట్టంబు నొద్ద
నుభయ సైన్యములకు యుద్ధం బెసఁగెఁ దురు
ష్కులు శత్రుసేన ప్రయ్యలుగఁ జేసి
గీ॥ హేము బంధించికొనుచు బై రాముఁ జేర్చి
రతఁడు కారుణ్యమును మానియక్బరుఁ గని
శత్రుశేష ముపద్రవసమితిఁ దెచ్చు
శీఘ్రముగ వీనిమస్తంబుఁజెండు" మనియె.192
శా॥ "నామేల్గూర్చి వచించు నీనుడిఁ దలన్ దాల్పంగనౌఁ గాని యీ
హేముం డోడినవాడు; పట్టువడినాఁ; డీనాఁ డవధ్యుండు; నా
కై మన్నింపు" మటంచు నక్సరనె; ఖడ్గంబెత్తి ఖండించె బై
రాముం డత్తఱి హేముమస్త మిల పై రాలన్ భటుల్ భీతిలన్ 193 193
సీ॥ క్షాత్రప్రధాన నిశాత వర్తనుఁడౌట
నావేశ మదికొంత యలరుఁ గావి