పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

45



మ॥ కడులేఁబ్రాయపుఁ జిన్నికుఱ్ఱఁడగు నక్బర్ ముందు నిల్చుండి యె
    క్కుడు శౌర్యం బుసికోల్పి పూన్ప సుభటుల్ ఘోరంబుగాఁ దాఁకి ర
    య్యెడ ఢిల్లీపతీ యోడిపాఱె విజయం బింపారఁ బట్టాభి షి
    క్తుఁడునయ్యె హుమయూన్ నిజాప్తులును సంతోషించి యుప్పొంగగన్ 187
    
-:అక్పరు సింహాసన మెక్కుట:-

సీ॥ షేర్మండలంబను స్నిగ్ధ సౌధంబున
              హుమయూను కూర్చుండి యొక్క నాఁడు
    పొత్తముల్ చదువు నప్పుడు ప్రార్ధనము చేయు
              కాలంబుఁ దెలుపుచు గంట మ్రోగె
    వడివడి దిగిరాఁగదొడఁగె నాతఁడు నును
              పై యున్న మెట్లపై నడుగు జాఱెఁ
    బైనుండి క్రిందికిఁబడుట గాజు విధానఁ
              దలయును వేయిప్రక్కలుగఁ బగిలె
గీ॥ నవలఁ బంజాబునందున్న యక్బ రటకు
    వచ్చెఁ ఐదునైదువందలేఁబదియు నాఱు
    నగు శరత్తున నతనిఁ గల్యాణపురిని
    ఢిల్లీపతిఁ జేసి రుద్యోగులెల్లఁ గలిసి.188
    
మ॥ ప్రవిశేష ప్రకట ప్రభావుఁడగు బైరాంఖాను క్షాత్రైక ధ
    ర్మవిదుండాహుమయూను కోడలు సలీమాదేవిఁ బెండ్లాడి బాం
    ధవుఁడై యక్సరు బాల్యమూడి తరుణత్వంబౌందు నందాఁక రా
    జ్యవిధానంబును నిర్వహింపఁదొడఁగెన్ సంరక్షకుండై తగన్ 189
    
బైరాంఖాన్ విజయములు

సీ॥ కాశ్మీరమందు సికందరుసాహి సై
             న్యము ప్రోవుచేసి రణంబుఁ గోర
    నచటఁ గాబులులో నక్బరు ప్రతినిధి
             తరుణంబు వీక్షించి తిరుగఁ బడఁగ
    మాళ్వదేశాధీశమణి ఢిల్లీపైఁ బడు
             టెప్పు డెప్పుడటంచు నెగురు చుండఁ