పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

     'యమరకోట'కు నాఁటి సాయంతనంబు
      నడచి కన్గొని రచటి రాణాప్రహారు. 180

అగ్బరు జననము



మ॥ మనూజాధీశుఁడు వారినందఱును సన్మానించె సౌఖ్యం బెల
    ర్పను; నైదు బది వందలున్ నలువ దాపైనింక రెండైన యే
    టను నాకార్తిక జీవవారము హమీడాబాను బేగంబు పు
    త్రుని నీళ్లాడె నుదాత్త లక్షణయుతున్ దుర్వార తేజోన్నిధిన్ 181
    
శా॥ పెద్దల్ గోత్రజు లక్కుమారకునకు బ్రీతిన్ మహమ్మ జ్జలా
    లుద్దీ నక్బరు నామముంచిరి హుమాయూన్ పాదుసా చూచి యా
    ముద్దుంగుఱ్ఱని కీర్తివల్లి దెసలన్ బుష్పింపఁ గాంక్షించుచున్
    ముద్దల్ ముద్దలు పంచె నాప్తులకు సమ్మోదంబుమైఁ గస్తురిన్. 182
    
చ॥ తను గడుఁజేరఁదీసి తలదాఁచుకొనన్ నెలవిచ్చి పేర్మి నె
    నెక్కొనగ మెలంగు నయ్యమరకోట నృపాలునియొద్ద నాత్మ మో
    హనసతియౌ హిమీడను నిజాత్మజు నక్బరు నిల్పి వెంట న
    య్యనుచరు లేగుదేరఁగఁ బ్రయాణ మొనర్చె నతండు వెండియున్.183
    
మ॥ త్వరమై నాతఁడు పారశీకమును గాంధారంబు కాబూల్ వసుం
    ధరలన్ జేకొనెఁ గాని రాజ్యము స్థిరత్వం బందకే సాఁగె; నీ
    కరణిగా దాఁ బదునాలుగేడులు కడుఁ గష్టంబులం బొంది వం
    దురె; నీలోపలఁ గొన్ని మార్పు లచటన్ దోతెంచె ఢిల్లీపురిన్. 184
    
మ॥ అల షేర్ఖాన్ బలశౌర్యశోభితుఁడు రాజ్యం బెల్లఁ గౌశల్యముల్
    వెలయన్ బాలనచేసె వాని పిదప బృధ్వీపతుల్ చాల దు
    ర్బలులున్ గ్రూరులు నౌట రాజ్యమది స్థైర్యంబూడెఁ గొన్నేండ్ల క
    వ్వల రాజయ్యె సికంద రీతఁడు సురాపాన క్రియాలోలుఁడౌ 185
    
మ॥ స్థితి యిట్లుండు టెఱింగి దండుఁగొని డాసెన్ దా హుమాయూను శూ
    రతముం డుగ్రపరాక్రమక్రముఁడు బైరాంఖాను వచ్చెన్ జమూ
    పతి పండ్రెండవయేటనున్న సుతుఁ డక్బర్ గూడ నేతెంచె ను
    స్థితిమై యుద్ధము సాఁగె ఢిల్లీని సికందర్ సా చమూపాళితో.186