పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర




చ॥ వరుసగ ముప్పదేం డ్లి తఁడుపాలనమున్ బొనరించె నందులో
    నిరువదియైదు శాంతముగనెట్టులొ సాఁగె ననంతరమ్మునన్
    ధరతరముల్ తపింపఁగను దారుణ ఘోర విపత్తు దేశమున్
    బొరిగొని గౌరవంబు నుడిపోవఁగఁ జేనె నరుంతు దమ్ముగన్ 163
    
మ॥ అనఘున్ విక్రమసింహు భూరమణుఁ జేయన్ గల్గి ఢిల్లీపురం
    బున కేగెన్ హుమయూను వంగమున రాణ్ముఖ్యుండు సామంతుఁడై
    చను షేర్ఖాను స్వతంత్రరాజ్యమును సంస్థాపింప యత్నించి నా
    డను వార్తల్ విని పాదుషా వెడలె సైన్యాయత్తుఁడై వానిపై.164
    
రాజ్యచ్యుతుఁడై హుమాయూను కడగండ్లు పడుట.

ఉ॥ అంతములేని సైన్యముల నంబుధిచాడ్పున నిల్పియున్న సా
    మంతుని దాఁకి పోరుట ప్రమాదకరంబని సంధిఁగోరి వృ
    త్తాంతమునంపె షేర్కులుఁడు తానును సమ్మతిఁజూపెఁ గ్రుంకెఁ బొ
    ద్దంతట రెండు సైన్యములు నచ్చట నిల్చెను నిద్రం నొందగన్.165
    
చ॥ కొసరి కసాయి మేకలను గొంతులు గోయు విధాన మారియుశా
    మసఁగినయట్లు మృత్యువును నాలుక సాఁచిన భంగి డిల్లి సై
    న్యసమితి పైనవ్రాలి తునుమాడఁగఁ జొచ్చిరి నిద్రవోవు చుం
    డు సమయమందె వంగసుభటుల్ తమనాథుని యాజ్ఞ పెంపునన్.166
   
మ॥ హుమయూ నంతటఁబాఱె ఢిల్లీదెస కత్యుగ్రుండు షేర్ఖాన్ ససై
    న్యముగా వెంటనుఁదాఁకె నేమియును జేయలేక యందందు మా
    ర్గమున జిక్కిన వారిఁ జేర్చుకొని పాఱన్ జొచ్చెఁ బాంచాల దే
    శము డాయంగనె రెండు సైన్యములకున్ సంగ్రామ మయ్యెన్ వడిన్. 167
    
సీ॥ రణమంచు వినిన మరణమంచు బెదరి ది
           ఙ్మార్గంబులకుఁ గొంతమంది నడువ
   సమదశాత్రవ పరాగము దృష్టిగతమైన
           మది కలంగియుఁ గొంతమంది పాఱ
   విమతసైన్యము దర్శనము దండధరదర్శ
           నంబని యడలి కొందఱు తొలంగ